LOADING...
Dussehra Special: ఇంట్లో తయారు చేసుకోగల 'కమ్మటి పరమాన్నం'.. ఎలా చేయాలంటే?
ఇంట్లో తయారు చేసుకోగల 'కమ్మటి పరమాన్నం'.. ఎలా చేయాలంటే?

Dussehra Special: ఇంట్లో తయారు చేసుకోగల 'కమ్మటి పరమాన్నం'.. ఎలా చేయాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండగ అంటే.. సవ్వడి వంటలు, రుచికరమైన నాన్వెజ్ వంటకాలు, తప్పనిసరిగా ఒక స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంట్లో ఏ స్వీట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఈస్టోరీ మీ కోసం, అందరికీ నచ్చే, రుచికరమైన పరమాన్నం రెసిపీ ఇక్కడ ఉంది. దాదాపు అందరూ ఈ రెసిపీ చేస్తారు, కానీ రుచికరంగా, పర్ఫెక్ట్ టేస్ట్తో చేయడం అంత సులభం కాదు. కానీ ఈ రెసిపీని అనుసరిస్తే, పండగ సంబరాలు రెట్టింపు ఉత్సాహంగా మారతాయి!

Details

కావాల్సిన పదార్థాలు 

బియ్యం - 1 కప్పు పెసరపప్పు - 1/2 కప్పు శనగపప్పు - 1/4 కప్పు పాలు - 1 కప్పు నీరు - 5 కప్పులు బెల్లం - 2 కప్పులు యాలకుల పొడి - 1/2 స్పూన్ పచ్చకర్పూరం - చిటికెడు నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - 1/4 కప్పు కిస్‌మిస్ - 2 టేబుల్ స్పూన్లు

Details

తయారీ విధానం

1. ముందుగా గిన్నె పెట్టి పెసరపప్పు వేయాలి. 4 నిమిషాల పాటు వేయించాలి 2.మరో గిన్నెలో బియ్యం, ఫ్రై చేసిన పెసరపప్పు, శనగపప్పు తీసుకోవాలి. వీటిని రెండు సార్లు కడిగి, 2 కప్పుల నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. 3. తర్వాత మిగిలిన 3 కప్పుల నీరు, పాలు పోసి స్టౌపై ఉడికించాలి. మీడియమ్ ఫ్లేమ్‌లో రైస్, పప్పులు పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. 4. రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. తరువాత యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి మిక్స్ చేయాలి. 5. మరో పాన్‌లో నెయ్యి కరిగించి, జీడిపప్పు మరియు కిస్‌మిస్ ఫ్రై చేయాలి. 6. వీటిని పరమాన్నంలో వేసి బాగా కలపితే రెడీ అవుతుంది.

Details

 టేస్టీ పరమాన్నం రెడీ!

దసరా పండగ రోజున ఇలా పరమాన్నం చేస్తే, రుచికరంగా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా ఈ పండగలో ట్రై చేయండి, పండగ మజా రెట్టింపు అవుతుంది!