'Living Nostradamus': 'లివింగ్ నోస్ట్రడామస్' సంచలన జోస్యం.. ఆర్కిటిక్లో యుద్ధ మేఘాలు?
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్ ఘటనలపై తాను గతంలో చేసిన కొన్నిఅంచనాలు నిజమయ్యాయని చెప్పుకుంటూ "లివింగ్ నోస్ట్రడామస్"గా గుర్తింపు పొందిన అథోస్ సలోమే మరో సంచలన హెచ్చరిక చేశారు. 2026కు సంబంధించి తాను గత ఏడాది చేసిన 10అంచనాల్లో ఇప్పటికే రెండూ నిజమయ్యాయని, ఇప్పుడు ప్రపంచం మరో పెద్దఘర్షణకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణమార్పుల ప్రభావంతో ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త యుద్ధపరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది విడుదల చేసిన తన అంచనాల్లో మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమం వివాదాలకు దారితీస్తుందని,దాని కారణంగా 2026 రెండో త్రైమాసికంలో ప్రాంతీయ అస్థిరత మరింత పెరుగుతుందని అంచనా వేశారు.
వివరాలు
ఫుట్బాల్ ప్రపంచకప్ విజేతను కూడా ముందే అంచనా వేసిన సలోమే
అంతేకాకుండా ఇటీవల జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ విజేతను కూడా తానే ముందుగా అంచనా వేసినట్లు సలోమే చెప్పారు.
విజేత జట్టు జెర్సీలో అగ్నిని సూచించే రంగులు ఉంటాయని,స్పెయిన్,పోర్చుగల్,నెదర్లాండ్స్, ఫ్రాన్స్, మొరాకో,అర్జెంటీనా లేదా ఇంగ్లండ్ జట్లలో ఒకటి ట్రోఫీని గెలుచుకునే అవకాశముందని అప్పట్లో పేర్కొన్నట్లు తెలిపారు.
చివరకు స్పెయిన్ విజేతగా నిలవడంతో తన అంచనా సరైందని ఆయన వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా పలువురు పోర్చుగల్ను విజేతగా భావించినప్పటికీ, తాను మాత్రం ఫైనలిస్టులను గుర్తించి స్పెయిన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పదేపదే చెప్పానని వ్యాఖ్యానించారు.
ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంపైనా సలోమే మరో అంచనా వెల్లడించారు.
వివరాలు
ఆర్కిటిక్ ప్రాంతంపై ఆసక్తికర వ్యాఖ్యలు
తాజాగా ఆర్కిటిక్ ప్రాంతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొత్త సముద్ర మార్గాలు, ఇంధన వనరులు అందుబాటులోకి రావడంతో రష్యా, నాటో దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రష్యా ఇప్పటికే ఆర్కిటిక్లోని వ్యూహాత్మక ప్రాంతాలకు క్షిపణి వ్యవస్థలను తరలిస్తున్నట్లు తాజా సమాచారం సూచిస్తోందని చెప్పారు.
2026లో ఆర్కిటిక్లో మంచు మరింత కరిగితే ప్రత్యక్ష ఘర్షణలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నైజర్ ఉత్తర ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థల ప్రభావం పెరగడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగే అవకాశముందని చెప్పారు.
వివరాలు
పలు దేశాల మధ్య పరోక్ష పోటీ పెరిగే అవకాశం
పాశ్చాత్య దేశాల సైనిక బలగాలు వెళ్లిపోయిన తర్వాత తమ ప్రభావాన్ని కొనసాగించాలనే ప్రయత్నంలో పలు దేశాల మధ్య పరోక్ష పోటీ పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇతర జ్యోతిష్కుల మాదిరిగా తాను కేవలం భవిష్యవాణులు చెప్పేవాడిని కాదని,పారాసైకాలజీ పరిశోధకుడినని సలోమే చెబుతున్నారు.
సంకేతాల విశ్లేషణ,దీర్ఘకాలిక పరిణామాల పరిశీలన,కబాలా అధ్యయనాలను కలిపి భవిష్యత్ అంచనాలు వేస్తానని వివరించారు.
అయితే ఏ అంచనా కూడా వంద శాతం కచ్చితమైనది కాదని,ఇవి కేవలం పరిస్థితుల ఆధారంగా చేసిన విశ్లేషణలేనని స్పష్టం చేశారు.
గతంలో కరోనా మహమ్మారి, బ్రిటన్ మాజీ రాణి ఎలిజబెత్-2 మరణాన్ని కూడా ముందుగానే అంచనా వేసినట్లు ఆయన గురించి ప్రచారం ఉంది.
అయితే ఈ వాదనలకు స్వతంత్ర ధృవీకరణ అందుబాటులో లేదు.