Page Loader
Mothers Day: మదర్స్ డే అమ్మకు భక్తి,ఆనందం రెండూ కానుకగా ఇవ్వండి.. ఈ పవిత్ర ప్రదేశాలు మిస్ కాకండి!
మదర్స్ డే అమ్మకు భక్తి,ఆనందం రెండూ కానుకగా ఇవ్వండి.. ఈ పవిత్ర ప్రదేశాలు మిస్ కాకండి!

Mothers Day: మదర్స్ డే అమ్మకు భక్తి,ఆనందం రెండూ కానుకగా ఇవ్వండి.. ఈ పవిత్ర ప్రదేశాలు మిస్ కాకండి!

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమ్మ గొప్పతనాన్ని ఎంతగా వర్ణించినా చాలదు. ఆమె కోసం ఎంత చేసినా అది తక్కువే అనిపిస్తుంది. తల్లి ప్రేమ అనే విశాల సముద్రం స్వార్థరహితత,సహనం, అనురాగానికి చిరునామా. తల్లి అంటే.. గురువు, స్నేహితురాలు, ప్రేరణాధాయిని అన్నీ ఆమెలోనే ఉన్నాయి. మన జీవితంలో ఉన్న ప్రతి విజయానికీ ఆమె ఆశీర్వాదం ఉండగా, ప్రతి కష్ట సమయంలో ఆమె మద్దతుగా నిలుస్తుంది. అందుకే తల్లిని అభిమానించడానికి, ఆమె ప్రేమను గౌరవించడానికి మదర్స్ డే అనేది గొప్ప అవకాశం. ఈ సంవత్సరం మదర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహించాలనుకుంటే, ఈ కథనం మీ కోసమే.

వివరాలు 

అమ్మ కోసం మరింత ప్రత్యేకమైనదేదైనా చేయాలనుకుంటే..

ప్రతి సంవత్సరం మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మదర్స్ డే మే 11న వస్తోంది. ఈ ప్రత్యేక రోజున పిల్లలు తమ తల్లులకు ఎంతో ప్రత్యేకతను అనుభూతి కలిగించేందుకు వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొందరు తల్లులకు కేకులు, చీరలు వంటి బహుమతులు ఇస్తే, మరికొందరు అవసరమైన వస్తువులతో సర్‌ప్రైజ్ చేస్తారు. కానీ మీరు అమ్మ కోసం మరింత ప్రత్యేకమైనదేదైనా చేయాలనుకుంటే, ఆమెను ఈ ఐదు పవిత్ర ప్రదేశాలలో ఏదైనా ఒకదానికి తీసుకెళ్లండి. ఆ ప్రయాణం ఆమె మనసుకు శాంతిని, ఆనందాన్ని అందిస్తుంది.

#1

వారణాసి 

భారతదేశపు ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన వారణాసి ఎన్నో శతాబ్దాల పౌరాణికతను మించిన ప్రదేశం. ఇక్కడ మీ తల్లితో కలిసి దశాశ్వమేధ ఘాట్ వద్ద జరిగే గంగా ఆర్తిలో పాల్గొంటే ఆమెకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయం, సంకట మోచన్ హనుమాన్ ఆలయాలను దర్శించడమూ ప్రత్యేకమే. మరింత మధురమైన అనుభూతి కోసం సూర్యోదయ సమయంలో అమ్మతో బోటు ప్రయాణం చేయండి. అంతేగాక, అక్కడి మార్కెట్లలో షాపింగ్ చేయండి, స్థానిక ఆహారాన్ని ఆస్వాదించండి.

#2

ఋషికేశ్

ప్రపంచానికి యోగా రాజధానిగా గుర్తింపు పొందిన ఋషికేశ్, మానసిక ప్రశాంతతను కోరుకునే వారికోసం ఆదర్శ ప్రదేశం. యోగా, ధ్యానం వంటి విషయాలపై మీ అమ్మకు ఆసక్తి ఉంటే, ఇక్కడి యోగా శిబిరాలలో పాల్గొనండి. ఇక్కడి ఆలయాలను సందర్శించండి. అంతేగాక, గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. సాయంత్రం త్రివేణి ఘాట్ వద్ద జరిగే గంగా ఆర్తిని చూడటం మర్చిపోకండి - అది చైతన్యాన్ని పంచుతుంది.

#3

మధురై - మీనాక్షి ఆలయం

తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం, పార్వతీదేవి మీనాక్షి రూపంలో, శివుడు సుందరేశ్వరుడిగా నివసించే పవిత్ర ప్రదేశం. ఇది ద్రావిడ శిల్పకళకు ప్రతీక. రంగురంగుల గోపురాలు, కళాత్మక స్తంభాల మండపాలు, విస్తృతమైన ప్రాంగణం అమ్మను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆధ్యాత్మికతతో పాటు కళాభిమానులను కూడా ఆకట్టుకునే ఈ ఆలయం, తల్లికి ఆనందాన్ని కలిగించే స్థలం.

#4

బోధ్‌గయా

బౌద్ధ ధర్మానికి ఆధారస్తంభంగా నిలిచిన బోధ్‌గయా, బుద్ధుడు బోధివృక్షం క్రింద బోధిని పొందిన స్థలం. ఇక్కడ మహాబోధి ఆలయం తల్లితో కలిసి సందర్శించదగిన ప్రదేశం. బోధివృక్షం కింద కూర్చొని కొంత సమయం ధ్యానంలో గడిపితే ఆమెకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ తర్వాత నగరంలోని ఇతర బౌద్ధ మఠాలు, ధ్యాన కేంద్రాలను చూడండి. ఇది అమ్మకు కొత్త రకం అనుభూతిని కలిగిస్తుంది.

#5

షిర్డీ

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీ, సాయిబాబా ఆలయంతో ప్రసిద్ధి చెందింది. మీ అమ్మ సాయిబాబా భక్తురాలయితే, షిర్డీ యాత్ర ఆమెకు భావోద్వేగాలను కలిగించే అనుభవం అవుతుంది. సాయిబాబా సమాధి మందిరం, ద్వారకా మాయి, చావడిలను దర్శించండి. ఆధ్యాత్మిక శాంతి ఆమెను ఆనందంతో నింపుతుంది. ఈ యాత్రను ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది.