NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Purnam Boorelu: ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Purnam Boorelu: ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం 
    ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం

    Purnam Boorelu: ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పండుగలు, శుభకార్యాలైనప్పటికీ భోజన ప్రియుల దృష్టి బూరెల పైనే ఉంటుంది.

    ఈ రోజుల్లో, చాలా మందికి పూర్ణం బూరెల తయారీ తెలియదు. కానీ ఒకప్పటి రోజుల్లో పండుగలు, ఫంక్షన్లు పూర్ణం బూరెలు లేకుండా పూర్తికావడం అసాధ్యం.

    అందరికీ ఎంతో ఇష్టమైనవే అయినా, కొన్ని మంది వీటిని సరిగ్గా, రుచిగా చేయలేకపోతుంటారు. ఈ ఉగాది ప్రత్యేకంగా, టేస్టీ టేస్టీ పూర్ణం బూరెల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.

    వివరాలు 

    తయారీకి అవసరమైన పదార్థాలు: 

    మినపప్పు - 1 కప్పు

    బియ్యం - ¼ కప్పు

    శనగపప్పు - 1 కప్పు

    బెల్లం తురుము - 1 కప్పు

    యాలకుల పొడి - కొద్దిగా

    వంట సోడా - స్వల్పం

    ఉప్పు - 1 టీ స్పూన్

    నెయ్యి - తగినంత

    నూనె - వేయించడానికి సరిపడా

    నీరు - 2 కప్పులు

    వివరాలు 

    తయారీ విధానం: 

    ముందుగా మినపప్పు,బియ్యాన్ని శుభ్రంగా కడిగి వేర్వేరుగా 5 గంటలు నానబెట్టాలి.అనంతరం మిక్సీలో వేసి నీరు ఎక్కువ కాకుండా కొంచెం గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి.

    గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం సిద్ధం చేసుకోవాలి.

    శనగపప్పును శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు పోసి నానబెట్టాలి. ఒక గంట తర్వాత, కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.

    నీరు వడకట్టి, మెత్తగా మెదిపి, అందులో తగిన బెల్లం కలిపి, స్టౌపై తక్కువ మంటలో వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగి, మిశ్రమం ముద్దగా మారే వరకు కలుపుతూ ఉండాలి.

    నీరు లేకుండా గట్టిపడే వరకూ ఉడికించాక, కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి కలిపి స్టౌ నుంచి దింపేయాలి.

    వివరాలు 

    తయారీ విధానం: 

    మిశ్రమం చల్లారిన తర్వాత, కావలసిన సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి.

    ఇప్పుడు మినపప్పు, బియ్యం పిండిలో కొద్దిగా వంట సోడా, ఉప్పు వేసి బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి.

    కడాయిలో నూనె వేడిచేసి, తయారైన పూర్ణం ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసి, మధ్య మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.

    వేయించి టిష్యూ మీద తీసుకుని, పై నుంచి కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే, అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉగాది

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఉగాది

    ఉగాది 2023: పండగ పర్వదినాన ప్రత్యేకంగా చేసుకోవాల్సిన వంటలు పండగ
    Mahesh Babu: దర్శకుడు మహేశ్ బాబుకు బాపు-రమణ పురస్కారం ఉగాది
    Ugadi 2025: ఈ ఏడాది ఉగాది సంవత్సరం కొత్త పేరు ఏమిటో తెలుసా? ఆసక్తికరమైన విశేషాలు ఇవే! ఉగాది
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025