NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Republic Day 2025 : రిపబ్లిక్‌ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Republic Day 2025 : రిపబ్లిక్‌ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?
    రిపబ్లిక్‌ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?

    Republic Day 2025 : రిపబ్లిక్‌ డే జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మన భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించింది. ఆ తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది.

    ఈ రాజ్యాంగం ప్రకారం, భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఏర్పడింది.

    అందుకే, ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే)ను జాతీయంగా ఘనంగా నిర్వహిస్తారు.

    మన దేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించి, భారత జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు.

    అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా పూజ్యంగా జరుపుకుంటున్నారు.

    వివరాలు 

    గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సాక్షిగా రాష్ట్రపతి గౌరవ వందనం 

    భారతదేశం ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశం. ఇందులో పాలన భారత రాజ్యాంగం ఆధారంగా సాగుతుంది.

    రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న దీనిని ఆమోదించింది, 1950 జనవరి 26న ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

    ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రథమ పౌరుడు, అంటే రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను గౌరవ రాష్ట్రపతి ఎగురవేస్తారు.

    న్యూఢిల్లీ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సాక్షిగా రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు.

    భారత సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ రాష్ట్రపతే.ఈ పరేడ్‌లో భారత సైన్యం తమ ట్యాంకులు, మిసైళ్లు,రాడార్లు,యుద్ధ విమానాలు వంటి వాటిని ప్రదర్శిస్తారు.

    గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవనం నుంచి ప్రారంభమై, ఇండియా గేట్ వద్ద ముగుస్తుంది.

    వివరాలు 

    బీటింగ్ రిట్రీట్ వేడుక ఎక్కడ జరుగుతుంది? 

    బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం రైజీనా హిల్స్ వద్ద రాష్ట్రపతి భవనం ఎదుట నిర్వహించబడుతుంది.

    ఈ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరౌతారు. గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా బీటింగ్ రిట్రీట్ నిర్వహిస్తారు.

    ఇది గణతంత్ర దినోత్సవం ముగిసిన మూడవ రోజున, అంటే జనవరి 29వ తేదీ సాయంత్రం జరుపబడుతుంది.

    ఈ వేడుకలో పదాతి దళం, వైమానిక దళం, నావికా దళం తమ బ్యాండ్లతో సంప్రదాయ సంగీతం వినిపిస్తూ మార్చ్ చేస్తారు.

    వివరాలు 

    జాతీయ సాహస పురస్కారాలు ప్రదానం

    భారతదేశం ప్రతి ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భముగా, ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు జాతీయ సాహస పురస్కారాలు అందజేస్తారు.

    ఈ అవార్డులను 1957 నుంచి ప్రారంభించారు. ఈ పురస్కారం పొందినవారు ఒక పతకం, ధ్రువపత్రం, నగదు బహుమతి అందుకుంటారు.

    అలాగే, స్కూల్ విద్య పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం కూడా అందించబడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025