అగ్నిపర్వతంపై పిజ్జా వండుకు తిన్న మహిళా పర్యటకురాలు.. వీడియో వైరల్
అలెగ్జాండ్రా బ్లాడ్జెట్, ఈమె ప్రపంచ పర్యటకురాలు. విహార యాత్రలు చేయడం అంటే ఈమెకు ఎంతో ఇష్టం. ఇష్టం అనేకంటే ష్యాషన్ అంటే సరిగ్గా సరిపోతుందేమో. సరికొత్త ప్రదేశాల్లో ఆనందంగా గడపడమంటే ఆమెకు ఎంతో ప్రియం.తాజాగా గ్వాటెమాలలోని వాల్కనోని అలెగ్జాండ్రా సందర్శించారు. అంతటితో ఆగకుండా సదరు వాల్కనోపై పిజ్జా వండుకుని లాగించేసింది. ఈ మేరకు అక్కడ తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 2021లో బద్దలైన అగ్నిపర్వతం ఇక్కడ యాక్టివ్గానే ఉందని, నేషనల్ పార్క్లోనికి తప్పనిసరిగా గైడ్ తోనే వెళ్లాలని ఆమె పేర్కొన్నారు. తాము పిజ్జా తయారు చేసుకునేందుకు ముందుగానే బుక్ చేసుకున్నామన్నారు. పిక్నిక్ స్పాట్ వద్ద చలిగా ఉంటుందని, గాలులు వీస్తాయి అనే క్యాప్షన్తో పోస్టు షేర్ చేసింది. .