NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  
    తదుపరి వార్తా కథనం
    Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  
    డిజిటల్‌ మోసాలపై కలిసికట్టుగా పోరాడదాం.. RBIని కోరిన ఎయిర్‌టెల్

    Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్‌ పిలుపునిచ్చింది.

    దాదాపు 40కి పైగా బ్యాంకులు,భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌ బి ఐ),నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది.

    ఇప్పటికే వెలుగులోకి వచ్చిన మోసాలకు సంబంధించిన ఆర్థిక డొమైన్‌లను ఒక రిపాజిటరీ రూపంలో రూపొందించి,నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడంతో పాటు,డిజిటల్‌ మోసాలను విభిన్న దశలలో ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్‌ అభిప్రాయపడింది.

    ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ బ్యాంకులతో సహా ఇతర ప్రధాన బ్యాంకులను కూడా ఈ ప్రతిపాదనపై సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

    వివరాలు 

    ఎయిర్‌టెల్‌-ఎన్‌పీసీఐ మధ్య భాగస్వామ్యం

    మోసాలకు పాల్పడుతున్న ఆర్థిక డొమైన్‌ల వివరాలను పంచుకోవడానికి సంయుక్త రిపాజిటరీ ఏర్పాటు చేయాలన్న సూచనను ఎయిర్‌టెల్‌ ఆర్‌బీఐకి కూడా పంపించింది.

    నియంత్రణ పరంగా చర్చలు జరిపేందుకు కూడా సంస్థ సన్నద్ధంగా ఉందని తెలిపింది.

    వినియోగదారుల భద్రతను పెంచే విధంగా ఒక సమగ్ర నియమావళిని రూపొందించడంలో భాగస్వామ్యంగా ఉంటామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

    డిజిటల్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని కూడా సూచించింది.

    భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఎయిర్‌టెల్‌-ఎన్‌పీసీఐ మధ్య భాగస్వామ్యం కీలకమని సంస్థ స్పష్టంచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్

    తాజా

    Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్   ఎయిర్ టెల్
    Video: ఆర్డర్‌ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్‌ ధ్వంసం  ఉత్తర్‌ప్రదేశ్
    HBD Balakrishna: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ ఘనత.. 400 రోజులు ఆడిన నటసింహా సినిమా ఏమిటో తెలుసా? బాలకృష్ణ
    Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు గుజరాత్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025