LOADING...
NVIDIA chips: అమెరికా ఆంక్షల ప్రభావం: చైనా టెక్ దిగ్గజాల AI ట్రైనింగ్‌ దక్షిణాసియాకు షిఫ్ట్
అమెరికా ఆంక్షల ప్రభావం: చైనా టెక్ దిగ్గజాల AI ట్రైనింగ్‌ దక్షిణాసియాకు షిఫ్ట్

NVIDIA chips: అమెరికా ఆంక్షల ప్రభావం: చైనా టెక్ దిగ్గజాల AI ట్రైనింగ్‌ దక్షిణాసియాకు షిఫ్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అలీబాబా, బైట్‌డాన్స్‌ వంటి ప్రముఖ చైనా టెక్ సంస్థలు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల ట్రైనింగ్ కార్యకలాపాలను వేగంగా దక్షిణాసియా దేశాల వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా, అత్యాధునిక AI ప్రాజెక్టులకు అవసరమైన NVIDIA చిప్స్‌ అందుబాటులోకి రావడానికి ఈ మార్పు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్య, అధునాతన సాంకేతిక రంగంలో కొనసాగుతున్న అమెరికా-చైనా పోటీను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

వ్యూహం మార్పు 

చైనాలోనే ట్రైన్ చేస్తున్నడీప్‌సీక్‌  

అమెరికా H20 చిప్ విక్రయాలపై ఏప్రిల్‌లో విధించిన ఆంక్షల తర్వాత చైనా సంస్థలు విదేశాల్లో ట్రైనింగ్ కార్యకలాపాలను పెంచుతున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. తమ మోడళ్లను విదేశాల్లో ట్రైన్ చేయడానికి, చైనా కంపెనీలు ఇప్పుడు చైనేతర యాజమాన్యంలోని డేటా సెంటర్లను లీజ్‌కి తీసుకుంటున్నాయని సమాచారం. అయితే, US ఎక్స్‌పోర్ట్‌ బ్యాన్‌కు ముందే పెద్ద మొత్తంలో NVIDIA చిప్స్‌ నిల్వ చేసుకున్న డీప్‌సీక్‌ మాత్రం తన మోడళ్లను చైనాలోనే ట్రైన్ చేస్తోంది.

చిప్ ఆవిష్కరణ 

AI చిప్ అభివృద్ధి కోసం హువావేతో డీప్‌సీక్ సహకారం

ఇదిలా ఉంటే, డీప్‌సీక్‌ దేశీయ చిప్ తయారీదారులతో, ముఖ్యంగా హువావే ఆధ్వర్యంలోని బృందాలతో కలిసి తదుపరి తరం చైనా AI చిప్‌లను అభివృద్ధి చేసే పనిలో కూడా భాగస్వామ్యం చేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా, అమెరికా ఆంక్షలు ఉన్నా, కీలక సాంకేతికతను స్వదేశంలోనే అభివృద్ధి చేయాలనే చైనా సంకల్పం మరోసారి బయటపడింది.

Advertisement