NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Investment Scam: వాట్సాప్ లో వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు
    తదుపరి వార్తా కథనం
    Investment Scam: వాట్సాప్ లో వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు
    వాట్సాప్ గ్రూప్‌లోకి వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు

    Investment Scam: వాట్సాప్ లో వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    02:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని 63 ఏళ్ల వృద్ధుడు భారీ మోసానికి గురయ్యారు.

    'స్టాక్ డిస్కషన్ గ్రూప్' పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేరి, మోసపూరిత స్కీంలో ఇరుక్కున్నాడు.

    ఈ గ్రూప్ నిర్వాహకుడు కునాల్ సింగ్ తనను ఒక అగ్రశ్రేణి ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకొని, గతంలో అనేక కస్టమర్లకు ఆశాజనక రాబడులను సాధించారని నమ్మించాడు.

    సింగ్ వాట్సాప్ గ్రూప్‌లో పలు లింక్‌లు షేర్ చేసి, వాటిలోకి చేరి ఆన్‌లైన్ సెషన్‌లు నిర్వహిస్తానని తెలిపాడు.

    ఈ సెషన్‌ల్లో పెట్టుబడి వ్యూహాలు, స్టాక్ మార్కెట్‌లో లాభాలపై వివరాలు చెప్పడంతో ఆ వృద్ధుడు మరింత ఆసక్తిగా ఈ క్లాసుల్లో పాల్గొన్నారు.

    Details

    ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : సైబర్ క్రైమ్ పోలీసులు 

    సింగ్‌ 'స్కైరిమ్ క్యాపిటల్' పేరుతో ఒక పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితమైనది అని చెప్పి, అతని ద్వారా పెట్టుబడులు పెట్టమని ఉత్సాహపరిచాడు.

    మొదట్లో, చిన్న మొత్తాలు పెట్టి, లాభాలు వస్తున్నట్లు చూపించడంతో బాధితుడికి నమ్మకం పెరిగింది.

    ఆపై మరింత పెట్టుబడి పెడితే ఇంకా మంచి లాభాలు వస్తాయని చెప్పి మొత్తంగా రూ. 50 లక్షలు పెట్టించేశారు.

    చివరికి లాభాలు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినపుడు, వెబ్‌సైట్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    కుంభకోణం

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    హైదరాబాద్

    Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా  తెలంగాణ
    Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్..  రానున్న నాలుగు రోజుల్లో  భారీ వర్షాలు  భారీ వర్షాలు
    Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత  తెలంగాణ
    Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా భారతదేశం

    కుంభకోణం

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్  బ్యాంక్
    భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు  జార్ఖండ్
    Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు  సీబీఐ
    దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025