NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు 
    రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

    Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 17, 2024
    08:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన ఓ 30 ఏళ్ల అకౌంటెంట్ సైబర్‌ నేరగాళ్ల కుట్రకు బలై భారీగా నష్టపోయాడు.

    స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో బాధితుడి నుంచి రూ.10.10 కోట్లు కాజేశారు.

    అక్టోబర్ 2న, అకౌంటెంట్ ఫోన్ నంబర్‌ను 'ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వెల్త్' పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పించేవారు.

    'చేతన్ సెహగల్' అనే వ్యక్తి పెట్టుబడులపై సలహాలు ఇచ్చి, అతని సహాయకురాలిగా మీరాదత్ పేరుతో మరో వ్యక్తి బాధితునితో నేరుగా మాట్లాడారు.

    అధిక లాభాల కోసం 'వీఐపీ ట్రేడింగ్ ఖాతా' తెరవాలని సూచించిన నిందితులు, అక్టోబర్ 17న రూ.లక్ష పెట్టుబడి పెట్టించగా, ఆ యాప్‌లో వర్చువల్ లాభాలు చూపించారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    ఆ లాభాలను చూసి మరింత పెట్టుబడులకు ప్రేరేపించి నవంబర్ 4 వరకు రూ.10.10 కోట్ల పెట్టుబడులను డిపాజిట్ చేయించుకున్నారు.

    వర్చువల్ లావాదేవీలలో రూ.24.36 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా మరో రూ.3 కోట్లు బదిలీ చేయాలని కోరారు.

    దాంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు, వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    స్టాక్ మార్కెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    హైదరాబాద్

    Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ తెలంగాణ
    Rain alert: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో కొన్ని గంటలలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. భారతదేశం
    Microchip Technology: హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ల తయారీకి ప్రయోగాలు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక పరిశోధన భారతదేశం
    Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు  భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు; సెన్సెక్స్‌ 256 , నిఫ్టీ@ 22650  బిజినెస్
    Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి  బిజినెస్
    Stock Market: చరిత్ర సృష్టించిన షేర్ మార్కెట్.. తొలిసారిగా 23000 దాటిన నిఫ్టీ  బిజినెస్
    Sensex Opening Bell: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ @22950  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025