NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్
    తదుపరి వార్తా కథనం
    అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్
    రాత్రిళ్లు ప్రయాణించే అధునాతన క్షిపణి అగ్ని ప్రైమ్

    అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    07:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలిస్టిక్ అగ్నిక్షిపణుల తరంలో కొత్తతరం మిస్సైల్ వచ్చి చేరింది. అగ్నిప్రైమ్ గా పిలుచుకునే ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రిళ్లు కూడా ప్రయాణం చేయగలదు.

    ఈ మేరకు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ నూతన తరం అగ్నిప్రైమ్ క్షిపణిని బుధవారం రాత్రి ప్రయోగించారు.

    అయితే ఈ పరీక్ష గ్రాండ్ సక్సెస్ సాధించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వెల్లడించింది.

    భారత సాయుధ దళాలకు అగ్నిప్రైమ్ క్షిపణిని అప్పగించే ముందు శాంపిల్ గా రాత్రిపూట చేసిన తొలి ప్రయోగంగా దీన్ని గుర్తించారు. గతంలోనూ డే టైమ్ లో మూడు సాధారణ పరీక్షలు నిర్వహించామని, ప్రతిసారి పరీక్షలు విజయవంతమయ్యాయని డీఆర్డీఓ స్పష్టం చేసింది.

    Details

    రాత్రుళ్లూ దూసుకెళ్లే అధునాతన మిస్సైల్ టెక్నాలజీ భారత్ సొంతం

    తాజాగా రాత్రిపూటలో చేసిన ప్రయోగం ద్వారా ఈ క్షిపణి వేగం, కచ్చితత్వం, సమర్థత, విశ్వసనీయతలను లెక్కించారు. విభిన్న ఏరియాల్లోని టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

    దీంతో రాత్రి వేళ అగ్నిప్రైమ్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు.

    ఈ మేరకు 2 కౌంట్ డౌన్ రేంజ్ నౌకలు సైతం అగ్నిప్రైమ్ మార్గంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాయి. దీంతో ప్రయోగం సఫలమైందని నిర్థారించుకున్న శాస్త్రవేత్తలు విషయాన్ని ప్రకటించారు.

    ఫలితంగా రాత్రుళ్లూ దూసుకెళ్లే అధునాతన మిస్సైల్ టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకోగలిగింది. దీనిపై స్పందించిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

    అనంతరం డీఆర్డీవో సైంటిస్టులకు, సిబ్బందితో సహా సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    అంతరిక్షం

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    అంతరిక్షం

    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ ఇస్రో
    జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా నాసా
    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో ఇస్రో
    తొలి మహిళా వ్యోమగామిని త్వరలో అంతరిక్షంలోకి పంపనున్న సౌదీ అరేబియా గ్రహం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025