రోవర్ కు తప్పిన పెను ప్రమాదం.. కొత్త మార్గానికి మళ్లించిన ఇస్రో
విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 రోవర్ కు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రోవర్ అంచున 4 మీటర్ల వెడల్పైన ఓ లోతైన గొయ్యిని గుర్తించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. దింతో అపప్రమత్తమైన ఇస్రో వెనక్కి రావాలని రోవర్ కు కీలక ఆదేశాలు జారీ చెయ్యడమే కాకుండా అది వెళ్లే మార్గాన్ని మళ్లించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో వెళుతోందని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 రోవర్ చంద్రుని అన్వేషించడానికి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ కావడం ద్వారా కొద్ది రోజుల ముందు చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను సాధించిన మొదటి దేశంగా భారతదేశం ఖ్యాతిని గడించింది.