జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా
జపాన్ మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్నివాయిదా వేసింది.జపాన్కు నైరుతిలో ఉన్నకగోషిమా ప్రిఫెక్చర్లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్ 2 ఏ రాకెట్ సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా పడింది. స్మార్ట్ ల్యాండర్ లేదా స్లిమ్, లూనార్ ప్రోబ్ను జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ చంద్రునిపై పరిశోధనలు జరపడానికి అభివృద్ధి చేసింది. ఈ మిషన్ గనుక విజయవంతమైతే చంద్రునిపై ప్రోబ్ను దించిన ఐదవ దేశంగా ప్రపంచంలో జపాన్ అవతరించనుంది. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా దిగింది. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండర్ మాడ్యూల్ దించిన దేశాల్లో అమెరికా, చైనా, రష్యాల తర్వాత భారత్ నాలుగో దేశంగా ఉంది.