NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా
    EV AIR TAXI: భారతదేశంలోకి విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీలు.. తొలి టాక్సీ ఇక్కడే

    EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 10, 2023
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో విద్యుత్ వాహకంగా నడిచే ఎయిర్ టాక్సీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా త్వరలోనే ఈ కొత్త ఈవీ వాహనం గాల్లో ఎగరనుంది.

    ఈ మేరకు 2026లో పూర్తి స్థాయి విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తామని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

    ఆర్చర్‌ ఏవియేషన్‌తో కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌-ఆర్చర్‌ ఎయిర్‌టాక్సీని దిల్లీలోని కన్నాట్‌ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు నడిపిస్తామని సంస్థ ప్రకటించింది.

    ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణం చేయాలంటే సుమారుగా గంట నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది.

    అయితే ఎయిర్‌ టాక్సీ అమల్లోకి వచ్చాక ఈ ప్రయాణం కేవలం 7 నిమిషాల్లోనే చేయవచ్చని స్పష్టం చేసింది.

    details

    ఒక్కో టాక్సీలో ఎంత మంది ప్రయాణం చేయవచ్చంటే.. 

    ఇదే సమయంలో భారత్‌లో పూర్తి విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ సేవలను ప్రారంభించడం, దాని నిర్వహణకు అవగాహనా ఒప్పందాన్ని(MOU)ను ఇరు కంపెనీలు ఖరారు చేసుకోవడం విశేషం.

    ఇందులో భాగంగానే ఇంటర్‌గ్లోబ్‌ గ్రూప్‌ ఎండీ రాహుల్‌ భాటియా, ఆర్చర్‌ సీసీఓ నిఖిల్‌ గోయెల్‌ ఎమ్‌ఓయూపై సంతకాలు చేశారు. అయితే ఎయిర్ టాక్సీ సేవలకు సంబంధిత నియంత్రణ అనుమతులు రావాల్సి ఉంది.

    ఏ,బీ గ్రేడ్ టౌన్ లల్లో ఎయిర్‌ టాక్సీ సేవలు సహా కార్గో, లాజిస్టిక్స్‌, వైద్యం, అత్యవసర సేవలకూ వీటిని ఉపయోగించనున్నారు. మరోవైపు చార్టర్‌ సేవలూ అందిస్తామని సంస్థ తెలిపింది.

    ఇండియాలో సేవలు అందించేందుకు దాదాపు 200 ఎయిర్‌ట్యాక్సీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో టాక్సీలో నలుగురు ప్రయాణం చేసే వీలుందని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యుత్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం బొగ్గు శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025