LOADING...
PIB fact-check: స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?  
స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?

PIB fact-check: స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్‌ తయారీదారులు ఇకపై సోర్స్‌కోడ్‌ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం కంపెనీలు ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి, కెమెరాలు,మైక్రోఫోన్‌లను ఉపయోగించకుండా నిరోధించడానికి సాఫ్ట్‌వేర్‌ మార్పులు చేయాల్సి ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా చేపట్టే ఈ చర్యలను స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజ కంపెనీలైన ఆపిల్‌, శాంసంగ్ లు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇది నిజం కాదని PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

వివరాలు 

రిపోర్ట్‌లో ఏం ఉందంటే..?

రాయిటర్స్ ప్రకారం, భారత్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ప్రభుత్వంతో సోర్స్ కోడ్ షేర్ చేయమని అడుగుతోంది, అలాగే కొన్ని సాఫ్ట్‌వేర్ మార్పులు చేయమని సూచిస్తోంది అని తెలిపింది. ఈ చర్యకు ఆపిల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు పక్కనుగా వ్యతిరేకత వ్యక్తం చేశాయంటూ రిపోర్ట్ పేర్కొంది. రాయిటర్స్ రిపోర్ట్‌లో, ఈ చర్చల్లో పాల్గొన్న నాలుగు వర్గాల వ్యక్తుల వివరాలు మరియు "గోప్యమైన ప్రభుత్వ, పరిశ్రమ పత్రాల సమీక్ష" ఆధారంగా ఈ వార్తను తయారు చేసినట్లు పేర్కొన్నారు. గమనించదగ్గది ఏమిటంటే, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సాధారణంగా తమ సోర్స్ కోడ్‌ను రహస్యంగా ఉంచుతారు. ఉదాహరణకి, 2014-2016 మధ్య ఆపిల్ చైనాకు కోడ్ ఇవ్వడాన్ని నిరాకరించింది, అలాగే అమెరికా న్యాయసంస్థలు కూడా కోడ్ పొందడంలో విఫలమయ్యాయి.

వివరాలు 

PIB ఫ్యాక్ట్ చెక్ 

రాయిటర్స్ రిపోర్ట్‌లో, ఈ చర్చల్లో పాల్గొన్న నాలుగు వర్గాల వ్యక్తుల వివరాలు, "గోప్యమైన ప్రభుత్వ, పరిశ్రమ పత్రాల సమీక్ష" ఆధారంగా ఈ వార్తను తయారు చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సాధారణంగా తమ సోర్స్ కోడ్‌ను రహస్యంగా ఉంచుతారు. 2014-2016 మధ్య ఆపిల్ చైనాకు కోడ్ ఇవ్వడాన్ని నిరాకరించింది, అలాగే అమెరికా న్యాయసంస్థలు కూడా కోడ్ పొందడంలో విఫలమయ్యాయి. "భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ తయారీదారులను తమ సోర్స్ కోడ్ షేర్ పంచుకోవాలని వస్తున్న ప్రతిపాదనను అబద్దం అని కేంద్రం (PIB) స్పష్టంగా తెలిపింది. మొబైల్ ఫోన్ తయారీదారులు కూడా PTIతో మాట్లాడుతూ,"ఇది కేవలం ప్రభుత్వ-పరిశ్రమ మధ్య రొటీన్ సంప్రదింపు మాత్రమే. ఎలాంటి కొత్త మాండేట్ లేదు" అని చెప్పారు.

Advertisement

వివరాలు 

పరిశ్రమ అభిప్రాయం 

IT శాఖ భారత టెలికాం సెక్యూరిటీ అస్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ (ITSAR) కింద పరిశ్రమతో చర్చలు చేస్తున్నది. ITSAR, నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ (NCCS) రూపకల్పనలో ఉంది. ITSARలో టెలికాం నెట్‌వర్క్ గేర్ భద్రతా ప్రమాణాలు, సాఫ్ట్‌వేర్ అప్డేట్లు, కమ్యూనికేషన్ పరికరాల సోర్స్ కోడ్ వంటి అంశాలు ఉన్నాయి. "ITSAR ప్రమాణాల ఆధారంగా MeitY మొబైల్ ఫోన్ల భద్రతా అంశాలను పరిశీలిస్తోంది. పరిశ్రమతో చర్చలు సజావుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రారంభంలో ఉంది, ఎలాంటి మాండేట్ ఇవ్వలేదు." Apple, Samsung, Google, Xiaomi,MAIT, ఈ కంపెనీలను ప్రతినిధిగా చూపే భారత పరిశ్రమ గుంపు PTI అభ్యర్థనలకు స్పందించలేదు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

PIB fact-check చేసిన ట్వీట్ 

Advertisement