Page Loader
Artificial Sun: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న భారత్..ఎంత పవర్ ఫుల్లో తెలుసా ? 
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న భారత్..ఎంత పవర్ ఫుల్లో తెలుసా ?

Artificial Sun: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న భారత్..ఎంత పవర్ ఫుల్లో తెలుసా ? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంతో పాటు మరో 30 దేశాల శాస్త్రవేత్తలు కలసి,ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ సూర్యుని నిర్మాణంపై కృషి చేస్తున్నారు. 'కృత్రిమ సూర్యుడు'గా పిలవబడే న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధనల రంగంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం న్యూక్లియర్ ఫ్యూజన్ సాంకేతికత ద్వారా శుద్ధమైన,అపరిమిత శక్తిని ఉత్పత్తి చేయడం. ఇది సహజ సూర్యుడిలో జరుగే ప్రక్రియను అనుకరిస్తుంది.గుజరాత్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (IPR)' 2013 నుండి SST-1 అనే ప్రాజెక్టుపై కృషి చేస్తోంది. భారతదేశం చేపట్టిన ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫ్యూజన్ రియాక్టర్‌లలో ఒకటి. ఇది సుమారు 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను ఉత్పత్తి చేసింది.

వివరాలు 

సూర్యుడి కేంద్ర భాగం కంటే 20 రెట్లు అధికం

ఇది సూర్యుడి కేంద్ర భాగం కంటే 20 రెట్లు అధికం. ఈ కృషితో భారత్, సూపర్‌కండక్టింగ్ టోకమాక్‌లను నడిపే ప్రపంచంలోని ఆరు దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు, ఇండియా తదుపరి తరం ఫ్యూజన్ రియాక్టర్ అయిన SST-2 నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీని పనులు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. SST-2లో బయోలాజికల్ షీల్డింగ్, అధునాతన ప్లాస్మా నియంత్రణ వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికతలు ఉంటాయి. భారతదేశం తొలి స్వదేశీ టోకమాక్ 'ఆదిత్య'ను 1989లో అభివృద్ధి చేసింది. ఈ మధ్య దీన్ని ఆధునికీకరించి 'ఆదిత్య-యూ'గా మార్చారు. ఇది ప్లాస్మా హీటింగ్, నిర్వహణలో సంప్రదాయ టోకమాక్‌ల పరిమితులను అధిగమించేందుకు తోడ్పడుతుంది.

వివరాలు 

35 దేశాల సంయుక్త ప్రయత్నంగా ప్రాజెక్టు

అంతర్జాతీయ స్థాయిలో,ఫ్రాన్స్‌లోని సెయింట్-పాల్-లెజ్-డురాన్స్ ప్రాంతంలో 2005లో ప్రారంభమైన ITER ప్రాజెక్టులో భారత్ పూర్తి భాగస్వామిగా ఉంది. 35 దేశాల సంయుక్త ప్రయత్నంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టు, న్యూక్లియర్ ఫ్యూజన్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించదగిన శక్తి వనరుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ITER రియాక్టర్ కూడా సూర్యుడి గర్భకర్ణం కంటే 10రెట్లు వేడిగా ఉండే ప్లాస్మాను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది భూమిపైనే ఒక చిన్న సూర్యుడిలా పని చేస్తుంది.ఈ ప్రాజెక్టులో భారత్ సుమారు 10 శాతం ఖర్చును భరిస్తోంది. మొత్తం ₹2.2బిలియన్ ఖర్చుతో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. ఇతర దేశాలలో కూడా ఈ రంగంలో ప్రగతి కనిపిస్తోంది.చైనా అభివృద్ధి చేసిన ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టోకమాక్‌ను కూడా "కృత్రిమ సూర్యుడు"గా పిలుస్తున్నారు.

వివరాలు 

చైనా సాధిస్తున్న పురోగతికి పోటీగా,భారత్

2025 జనవరిలో ఇది 1,066 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వద్ద ప్లాస్మాను కొనసాగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రంగంలో చైనా సాధిస్తున్న పురోగతికి పోటీగా,భారత్ కూడా సన్నద్ధమవుతోంది. SST-1 ద్వారా ఇప్పటికే భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పుడు SST-2 ద్వారా మరింత విస్తృత ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ పరిశోధనలు ఫ్రాన్స్‌లో జరుగుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి పరిశుభ్రమైనదిగా మాత్రమే కాక,అపరిమితమైనదిగా కూడా ఉంటుంది. ఇది గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలకు దారితీయదు. అంతేకాక, న్యూక్లియర్ ఫిషన్‌తో పోలిస్తే ఈ ప్రక్రియలో రేడియోధార్మిక వ్యర్థాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫ్యూజన్ రియాక్టర్‌లు డ్యూటీరియం, ట్రిటియం వంటి సముద్ర జలాల్లో లభించే ఇంధనాలను ఉపయోగిస్తాయి.