మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. 29న జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 29న శ్రీహరి కోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ను ప్రయోగించనున్నారు.
నావిగేషన్ రంగానికి చెందిన ఎస్వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో పంపించనుంది. షార్ లోని వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ లో (వ్యాబ్) రాకెట్ మూడు దశల అనుసంధానల పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేసి ఇప్పటికే ప్రయోగానికి సిద్ధం చేశారు.
మార్చిలో ఇస్రో PSLV-C55 ప్రయోగ వాహనంలో రెండు సింగపూర్ ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ద్వారా 2232 కిలోల బరువు గల ఎన్వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Details
12 సంవత్సరాల పాటు సేవలందించనున్న ఉపగ్రహం
ఇస్రో పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంటోంది. దేశ సరిహద్దులో 1500 కిలోమీటర్ల మేర నావిక్ కవరేజ్ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది.
ఈ రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్టకవచాన్ని అమర్చే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు.
ఈ ఉపగ్రహం విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు సేవలందించనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించాలంటే మీరు అధికారిక వెబ్సైట్ (https://t.co/274NfOt9bs)లో పేరు నమోదు చేసుకోవాలి.