Alcohol: అతిగా మద్యం సేవిస్తే 'లీకీ గట్.. హార్వర్డ్ అధ్యయనంలో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్టీల్లో లేదా స్నేహితుల కలయికల్లో ఒక్కసారి అయినా హద్దు మించి మద్యం తాగితే పెద్దగా నష్టం ఉండదని చాలామంది భావిస్తారు. అయితే, ఈ ఆలోచన తప్పేనని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. ఒక్కసారే అయినా పరిమితికి మించి మద్యం సేవిస్తే పేగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండు గంటల వ్యవధిలో మహిళలు నాలుగు పెగ్గులు, పురుషులు ఐదు పెగ్గులు తీసుకుంటే దానిని 'బింజ్ డ్రింకింగ్'గా పరిగణిస్తారు. ఇలా ఒక్కసారి చేసినా ప్రమాదం తప్పదని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించారు.
వివరాలు
భవిష్యత్తులో ఆల్కహాల్కు సంబంధించిన పేగు, కాలేయ వ్యాధులు
వారి పరిశీలన ప్రకారం, అతిగా మద్యం తాగినప్పుడు పేగుల గోడలు బలహీనమైపోతాయి. దీంతో హానికరమైన బ్యాక్టీరియా, విష పదార్థాలు రక్తంలోకి చేరుతాయి. ఈ పరిస్థితిని వైద్యులు 'లీకీ గట్'గా పిలుస్తారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు 'ఆల్కహాల్: క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్' అనే వైద్య జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అంశంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ గ్యాంగీ సాబో మాట్లాడుతూ, ఒక్కసారి అతిగా మద్యం సేవించినా పేగుల్లో వాపు మొదలై, వాటి రక్షణ గోడలు దెబ్బతింటాయని చెప్పారు. ఇది భవిష్యత్తులో ఆల్కహాల్కు సంబంధించిన పేగు, కాలేయ వ్యాధులు ఏర్పడటానికి తొలి అడుగుగా మారవచ్చని ఆమె హెచ్చరించారు.
వివరాలు
ఆల్కహాల్ సంబంధిత నష్టాన్ని తగ్గించే చికిత్సలకు మార్గం
అతిగా మద్యం తాగినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా 'న్యూట్రోఫిల్స్' అనే రోగనిరోధక కణాలు పేగుల పైపొరను దెబ్బతీసే వలల వంటి నిర్మాణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. అయితే, ఒక ప్రత్యేక ఎంజైమ్తో ఈ నిర్మాణాలను అడ్డుకున్నప్పుడు పేగులకు కలిగే నష్టం తగ్గడంతో పాటు బ్యాక్టీరియా లీకేజీ కూడా నియంత్రణలోకి వచ్చిందని తెలిపారు. ఇది భవిష్యత్తులో ఆల్కహాల్ సంబంధిత నష్టాన్ని తగ్గించే చికిత్సలకు మార్గం చూపవచ్చని భావిస్తున్నారు.