
Mark Zuckeberg: అమెరికా ప్రభుత్వంపై జుకర్బర్గ్ ఆరోపణలు .. ఆ పోస్ట్లను తొలగించాలని ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ సంబంధిత పోస్ట్లను సెన్సార్ చేయమని జో బైడెన్, కమలా హారిస్ల US ప్రభుత్వం పదేపదే మెటా బృందాలపై ఒత్తిడి తెచ్చిందని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జుకర్బర్గ్ ఆరోపించారు.
జుకర్బర్గ్ ఇటీవల హౌస్ జ్యుడిషియరీ కమిటీకి రాసిన లేఖలో ఈ ఆరోపణ చేశారు.
వీటన్నింటి గురించి తాను ఎక్కువ మాట్లాడనందుకు చింతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
వివరాలు
జుకర్బర్గ్ లేఖలో ఏం రాశారు?
జో బైడెన్- కమలా హారిస్ ప్రభుత్వం అమెరికన్ల కోవిడ్ సమాచారాన్ని సెన్సార్ చేయమని ఫేస్బుక్పై ఒత్తిడి చేసిందని, బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వివాదాస్పద ల్యాప్టాప్ కథనాలను కూడా పోస్ట్ కానివ్వకుండా అడ్డుకుందని చెప్పారు.
ఈ క్రమంలో 2021లో వైట్ హౌస్ సీనియర్ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని వివరించారు.
కోవిడ్పై సెటైరికల్ కామెంట్స్ మొదలుకుని ఎలాంటి కంటెంట్ అయినా సరే.. దాన్ని సెన్సార్ చేయమంటూ నెలల తరబడి పదేపదే ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేశారు.
వివరాలు
2020లో కూడా మెటాపై ఒత్తిడి పెరిగింది
2020 ఎన్నికలకు ముందు బైడెన్ కుటుంబం, బురిస్మా గురించి రష్యన్ తప్పుడు ప్రచారం గురించి FBI మెటాను హెచ్చరించిందని లేఖలో జుకర్బర్గ్ పేర్కొన్నారు.
ఒత్తిడి కారణంగా, మెటా తరువాత బైడెన్ కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఒక పోస్ట్ను తొలగించింది. అయితే, ఇది రష్యన్ తప్పుడు సమాచారం కానందున పోస్ట్ను తొలగించాల్సింది కాదని జుకర్బర్గ్ అంగీకరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జుకర్బర్గ్ రాసిన లేఖ
BREAKING: Mark Zuckerberg just admitted to working with Biden/Harris admin to censor Americans.
— Patrick Bet-David (@patrickbetdavid) August 27, 2024
He either admitted to this because:
1. He’s being honorable
2. He’s done with the Dem party
3. He’s getting ahead of a whistleblower
Either way this is a VERY HARD letter to write. pic.twitter.com/y64cOQjY15