Page Loader
Shubhanshu Shukla: ఐఎస్ఎస్‌లోకి వ్యోమగామి శుభాన్షు శుక్లా.. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్తోన్న రెండో భారతీయుడు
ఐఎస్ఎస్‌లోకి వ్యోమగామి శుభాన్షు శుక్లా..

Shubhanshu Shukla: ఐఎస్ఎస్‌లోకి వ్యోమగామి శుభాన్షు శుక్లా.. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్తోన్న రెండో భారతీయుడు

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాక్సియోమ్ మిషన్-4లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్,ఇస్రోకి చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లోకి ప్రవేశించనున్నారు. దీంతో ఆయన ఐఎస్ఎస్‌కి వెళ్లిన తొలి భారతీయుడిగా,అంతరిక్షంలో అడుగుపెడుతోన్నరెండవ భారతీయుడిగా చరిత్రలో ఒక కీలక మైలురాయిని సాధించనున్నారు. గతంలో,1984ఏప్రిల్ నెలలో భారతీయుడైన రాకేశ్ శర్మ రష్యాకు చెందిన సోయజ్ టీ-11వ్యోమనౌక ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత,శుభాన్షు శుక్లా ఇదే బాటలో అడుగుపెడుతున్నారు. ఈసారి వారు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్‌ను ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించింది. డ్రాగన్ అనే ఈస్పేస్‌క్రాఫ్ట్‌కు శుభాన్షు శుక్లా పైలట్‌గా సేవలందించనున్నారు. ఈప్రయోగానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

వివరాలు 

ఆక్సియమ్ మిషన్ 4 లో శుక్లాతో పాటు ఇతర సభ్యులు ఎవరు? 

యాక్సియోమ్-4 మిషన్‌లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ సుమారు రెండు వారాల పాటు విభిన్న శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు. అనంతరం వారు భూమికి తిరిగిరానున్నారు. ఈ మిషన్‌కు నేతృత్వం వహించేది మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్. ఆమె మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. 39 ఏళ్ల శుక్లా ఈ ప్రయాణంలో పైలట్ పాత్రను పోషించనున్నారు.ఆయన దాదాపు రెండు వారాల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో శుక్లా అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొననున్నారు.ఈ మిషన్‌లో శుక్లాతో పాటు ఇతర సభ్యులుగా పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ,విస్నివ్స్కీ,అలాగే హంగేరీకి చెందిన టిబోర్ కాపు పాల్గొంటారు.

వివరాలు 

భారతదేశం గగన్‌యాన్ మిషన్‌తో సంబంధం 

ఈ మిషన్ ద్వారా ఐఎస్ఎస్‌కి మొదటిసారిగా భారత్, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు ఒకేసారి వెళ్లనుండటం విశేషం. ఈ మిషన్ ఆక్సియమ్ స్పేస్ నిర్వహించే నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి విమానం అవుతుంది. దీనిని మే 29, 2025న ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత వైమానిక దళంలో గ్రూప్‌ కెప్టెన్‌‌గా పనిచేస్తున్న శుభాన్షు శుక్లా.. ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ మిషన్‌కు బ్యాకప్ వ్యోమగామిగా ఎంపికయ్యారు. నాసా,ఆక్సియమ్ స్పేస్‌తో ఒప్పందం ద్వారా భారతదేశం ఆక్స్-4 మిషన్‌లో స్థానం సంపాదించింది.

వివరాలు 

భారత వైమానిక దళంలో విశిష్ట పైలట్ గా శుభాన్షు శుక్లా

హూస్టన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాలలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇస్రో, నాసా మధ్య భాగస్వామ్యం ఈ మిషన్ తర్వాత కూడా కొనసాగవచ్చు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అక్టోబర్ 10, 1985న జన్మించిన శుభాన్షు శుక్లా భారత వైమానిక దళంలో విశిష్ట పైలట్. ఆయన లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, భారత సైన్యం, నేవీ, వైమానిక దళానికి అధికారులను సిద్ధం చేసే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుండి పట్టభద్రుడయ్యాడు. శుక్లా 2006లో భారత వైమానిక దళంలోకి చేరారు. అప్పటి నుంచి సుఖోయ్-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది.