
Meta Vs Open AI: ఓపెన్ఏఐ నిపుణులను నియమించుకున్న మెటా.. సామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత యుగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ టెక్నాలజీ సంస్థల మధ్య పోటీ బాగా తీవ్రమైంది. ఈ తరుణంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మెటా సంస్థపై షాకింగ్ ఆరోపణలు చేశారు. సామ్ ఆల్ట్మన్ పేర్కొన్న ప్రకారం, మెటా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీల ఆఫర్ ఇస్తోందన్నరు. ఆయన తెలిపారు మేరకు, మెటా సంస్థ కొందరి ఉద్యోగులకు మిలియన్ డాలర్ల స్థాయిలో, అంటే భారతీయ రూపాయల్లో దాదాపు రూ.833 కోట్లు వరకు ఆఫర్ చేస్తోందని వెల్లడించారు. ఓపెన్ఏఐను తమకు ప్రధాన పోటీదారిగా భావించిన మెటా, అందుకే ఇటువంటి ఆఫర్లతో దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
వివరాలు
కృత్రిమ మేథాలో వెనుకపడిపోతామన్న భయంతో..
ఈ ఆరోపణలకు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక సైతం మద్దతు ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం, మెటా సంస్థ ఓపెన్ఏఐ జ్యూరిచ్ కార్యాలయంలో పనిచేసిన ముగ్గురు ప్రముఖ ఏఐ పరిశోధకులను నియమించుకుంది. వీరిలో అలెగ్జాండర్ కోలెస్నికోవ్, లూకాస్ బేయర్, జియాహువా జై ఉన్నారు. ఈ ముగ్గురు పరిశోధకులు ఓపెన్ఏఐలో అత్యంత అనుభవజ్ఞులుగా, శాస్త్రీయ నైపుణ్యాలతో పేరుపొందిన్నవారని పేర్కొంది. కృత్రిమ మేథాలో వెనుకపడిపోతామన్న భయంతో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్ను నిర్మించేందుకు ప్రతిభావంతులను తీసుకోవాలని నిర్ణయించారు.
వివరాలు
మందగించిన మెటా సంస్థలోని ఏఐ ప్రాజెక్టుల పురోగతి
గత కొన్ని సంవత్సరాలలో మెటా సంస్థ నుంచి అనేకమంది ఏఐ నిపుణులు వేరే కంపెనీలకు వెళ్లిపోయారు. దీని ప్రభావంతో మెటా సంస్థలోని ఏఐ ప్రాజెక్టుల పురోగతి మందగించింది. ఈ ప్రతికూల పరిస్థితులను సవరించేందుకు జుకర్బర్గ్ రిక్రూట్మెంట్పై దృష్టి సారించారు. ఓపెన్ఏఐ, గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే ఏఐ రంగంలో ముందున్న తరుణంలో, మెటా కూడా తన స్థానాన్ని రక్షించుకునేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది.