Mission To Space Station: అంతరిక్షంలోకి భారత వ్యోమగామి.. శిక్షణిస్తున్న నాసా
భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి ఏర్పాట్లను చేస్తోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానికి దళానికి చెందిన పైలెట్లకు శిక్షణిస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంతో భాగంగా పైలట్లకు శిక్షాణా కార్యక్రమం జరుగుతోంది. ఇక 2024 నాటికి భారత వ్యొమగామిని స్పేస్ స్టేషన్ పంపించాలనే ఇండియా భావిస్తోంది. అయితే ఈ శిక్షణ తీసుకుంటున్న భారత వ్యోమగామి అభ్యర్థుల గుర్తింపు వివరాలను గోప్యంగా ఉంచింది. శిక్షణ పొందుతున్న వారంతా ఇప్పటికే రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ప్రారంభ శిక్షణ పూర్తి చేసినట్లు తెలిసింది.
భారత్ తరుఫున అంతరిక్షంలో మొదటిసారి ప్రయాణించిన రాకేశ్ శర్మ
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు టెక్సాస్లోని హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ లో అధునాతన శిక్షణ పొందుతున్నారు. ఇదిలా ఉండగా భారత్ తరుఫున వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడిగా నిలిచారు. ప్రస్తుతం గగన్ యాన్ ద్వారా భారత్ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.