NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి 
    తదుపరి వార్తా కథనం
    SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి 
    స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి

    SpaDeX: స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను చేపట్టిన విషయం విదితమే.

    భవిష్యత్‌లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఈ కీలకమైన పరిజ్ఞానాన్ని సాధించేందుకు ఇస్రో మరో ముందడుగు వేసింది.

    తాజాగా, స్పేడెక్స్‌ డీ-డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఘన విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    "ఈ విజయం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపుతుంది. అసాధ్యంగా కనిపించిన డీ-డాకింగ్‌ ప్రక్రియను స్పేడెక్స్‌ శాటిలైట్లు విజయవంతంగా పూర్తి చేశాయి. భారత అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌ వంటి భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది," అని మంత్రి ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన జితేంద్ర సింగ్ 

    Union MoS(Ind. Charge) Science & Technology; Earth Sciences, Jitendra Singh tweets, "Congrats, team ISRO. It is heartening for every Indian. SPADEX Satellites accomplished the unbelievable De-Docking… This paves the way for the smooth conduct of ambitious future missions,… pic.twitter.com/EiT8PQqGmS

    — ANI (@ANI) March 13, 2025

    వివరాలు 

    మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ సంబంధిత ప్రయోగాలు

    ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌లో భాగంగా ఇస్రో గతేడాది డిసెంబర్‌ 30న ఛేజర్‌, టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

    అనేక ప్రయోగాల అనంతరం జనవరి 16న డాకింగ్‌ ప్రక్రియ (SpaDeX) ను విజయవంతంగా నిర్వహించింది.

    ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.ఈ ప్రయోగ విజయవంతం కావడంతో ఇస్రో మరిన్ని పరిశోధనలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

    మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ సంబంధిత ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ ఇటీవల వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    జితేంద్ర సింగ్

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    ఇస్రో

    ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం  అంతరిక్షం
    ShakthiSAT: 'శక్తిశాట్‌' మిషన్.. అంతరిక్ష సాంకేతికతపై 108 దేశాలకు చెందిన బాలికలకు శిక్షణ స్పేస్-X
    NISAR Mission: NISAR మిషన్ కోసం ISRO రిఫ్లెక్టర్‌, భారతదేశానికి పంపిన నాసా నాసా
    ISRO Chief: సోమనాథ్ కీలక ప్రకటన.. 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 లాంచ్ టెక్నాలజీ

    జితేంద్ర సింగ్

    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పెన్షన్
    Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025