
Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్కి కౌంట్డౌన్ మొదలు.. ఇవాళే రోదసీ యాత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. యాక్సియం-4 (AX-4) మిషన్లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు నేడు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు స్పేస్ఎక్స్ ప్రకటించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. లిఫ్ట్-ఆఫ్ సమయంలో వాతావరణం 90 శాతం అనుకూలంగా ఉన్నట్టు తాజాగా స్పేస్ఎక్స్ తెలిపింది. మిషన్ వ్యవస్థలు కూడా సక్రమంగా ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది.
Details
శుభాంతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు
యాక్సియం-4 కింద శుభాంశుతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు రోదసియాత్ర చేపడుతున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ 'యాక్సియం స్పేస్' ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇందులో ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. రాకెట్ ఫాల్కన్-9 ద్వారా ఈ స్పేస్ క్యాప్సూల్ రోదసిలోకి వెళ్లనుంది. శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు స్వీకరిస్తారు. తొలుత ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ, అననుకూల వాతావరణం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు మార్లు వాయిదా పడింది.
Details
28 గంటల తర్వాత అంతరిక్ష కేంద్రాన్ని చేరుకొనే అవకాశం ఉంది
భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది. శుభాంశు బృందం అక్కడ 14 రోజుల పాటు ఉంటూ, భారరహిత పరిస్థితుల్లో పలు ప్రయోగాలు నిర్వహిస్తుంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో రోదసినుంచి ముచ్చటించే కార్యక్రమం కూడా ఉంది.