Page Loader
2022లో భూమిని చల్లబరిచిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే
2022లో భూమిని చల్లబరిచిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే

2022లో భూమిని చల్లబరిచిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

2022లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 'హంగా టోంగా' అగ్నిపర్వత విస్ఫోటనం, భూమిపై శీతలీకరణ ప్రభావం చూపిందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనకు టెక్సాస్ A&M యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ డెస్లర్ నాయకత్వం వహించారు. హిస్టారికల్ డేటా ఈ అన్వేషణలకు మద్దతు ఇస్తుంది. సూర్యరశ్మి అగ్నిపర్వత ఏరోసోల్‌లచే నిరోధించడంతో, పెద్ద పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాలు సాధారణంగా ప్రపంచ వాతావరణాన్ని చల్లబరుస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Details

రెండ్రోజుల పాటు ఏర్పడిన హంగా టోంగా విస్ఫోటనం

2022 జనవరి మధ్యలో రెండు రోజుల పాటు హంగా టోంగా విస్ఫోటనం సంభవించిన విషయం తెలిసిందే. జలాంతర్గామి స్వభావం కారణంగా ఆ విస్పోటనం ఏర్పడింది. దీని ఫలితంగా స్ట్రాటో ఆవరణలోకి అపూర్వమైన నీటి ఆవిరిని ఇంజెక్ట్ చేసింది. తద్వారా మొత్తం స్ట్రాటో ఆవరణలోని నీటి శాతం సుమారు 10శాతం పెరిగింది. శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు ద్వారా నీటి ఆవిరి పెరగడంతో భూమి చల్లబడిందని పరిశోధకులు గుర్తించారు.

Details

మానవ కార్యకలాపాలతోనే వాతావవరణ మార్పులు

పరిశోధనా బృందం భూమి వాతావరణ వ్యవస్థ శక్తి సమతుల్యతను అంచనా వేయడానికి ఇతర వేరియబుల్స్‌తో పాటు ఏరోసోల్స్, నీటి ఆవిరి ఉపగ్రహ డేటా పరిశీలనలను ఉపయోగించింది. విస్ఫోటనం తర్వాత వాతావరణ వ్యవస్థలోకి ప్రవేశించిన దానికంటే ఎక్కువ శక్తి, వాతావరణ వ్యవస్థను విడిచిపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా స్వల్ప శీతలీకరణ ప్రభావం ఏర్పడింది. మానవ కార్యకలాపాలు ప్రధానంగా వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయని డెస్లర్ అంచనా వేశారు.