NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ! 
    తదుపరి వార్తా కథనం
    RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ! 
    ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ!

    RCB: ఈ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడే.. ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు, జట్లన్నీ తమ స్క్వాడ్‌లను మెగా వేలంతో తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.

    వచ్చే ఏడాది మార్చి నుండి మే మధ్యకాలం వరకు ఐపీఎల్ 2025 జరగనున్నది.అయితే, కొన్ని జట్లు కెప్టెన్సీ విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయి.

    అందులో ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)జట్టు ఒకటి.

    భారీ ఫ్యాన్‌బేస్‌ను కలిగి ఉన్న ఆర్సీబీకి గత సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్‌ నేతృత్వం వహించారు.

    కానీ, అతడిని రిటైన్ చేసుకోకపోవడం, అలాగే మెగా వేలంలో ఆర్సీబీ అతన్ని తీసుకోకపోవడంతో, ఇప్పుడు జట్టు కెప్టెన్సీపై అనుమానాలు నెలకొన్నాయి.

    ఈ నేపథ్యంలో, ఆర్సీబీ అభిమానులు విరాట్ కోహ్లీని తిరిగి జట్టును నడిపించాలని కోరుతున్నారు. అయితే,విరాట్ కోహ్లీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    వివరాలు 

    స్పిన్‌ విభాగంలో ఆర్సీబీకి కొంతనష్టమే

    ఈ సందర్భంగా, ఆర్సీబీ మాజీ ఆటగాడు, విరాట్ కోహ్లీకి ఆప్తుడు ఏబీ డివిలియర్స్ ఆ జట్టు కెప్టెన్సీపై స్పందించారు.

    ''విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కెప్టెన్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ, ప్రస్తుతం ఆర్సీబీ స్క్వాడ్‌లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించగలిగే ఆటగాడు.ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ ఒక మంచి జట్టును పక్కన పెట్టింది. భువనేశ్వర్ కుమార్,జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రముఖ బౌలర్లతో పాటు, లుంగి ఎంగిడి కూడా ఆడుతున్నాడు. అతడు స్లో బంతులతో ప్రత్యర్థిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, స్పిన్‌ విభాగంలో ఆర్సీబీకి కొంతనష్టమే ఉంది. రవిచంద్రన్ అశ్విన్‌ను మిస్‌ అవుతున్నాం,ఆయన్ను సీఎస్కే తీసుకుంది. కానీ, అతడు ఎట్టకేలకు యెల్లో జెర్సీలో కనిపించడం ఆనందంగా ఉంటుంది.

    వివరాలు 

    ఐపీఎల్ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను ప్రారంభించాలి

    అయినప్పటికీ, ఆర్సీబీ స్క్వాడ్‌ సమతుల్యంగా కనిపిస్తోంది. ఒక మ్యాచ్‌ విన్నింగ్ స్పిన్నర్ లేకపోవడాన్ని, వారు తగిన విధంగా ఎదుర్కొంటారని అనుకుంటున్నాను. చిన్నస్వామి స్టేడియంలో విజయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి'' అని ఏబీ డివిలియర్స్ అన్నారు.

    ''ఆర్సీబీకి సరైన స్పిన్నర్‌ లేని సమస్యను పరిష్కరించడానికి, ఐపీఎల్ కమిటీ ట్రాన్స్‌ఫర్ విండోను ప్రారంభించాలి.భవిష్యత్తులో ఈ మార్గం ద్వారా ఏదైనా బలోపేతం పొందవచ్చని అనుకుంటున్నాను. ఐపీఎల్ టోర్నీ మధ్యలో ఈ నిబంధనను అమలు చేస్తే,ఆర్సీబీకి అదనంగా ఒక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను.అన్‌సోల్డ్ జాబితాలోని ప్లేయర్లను తీసుకోవడం కూడా ఒక మంచి పరిష్కారం అవుతుంది.ఈ అంశంపై ఐపీఎల్ కమిటీ ఆలోచన చేస్తుందని నేను నమ్ముతున్నాను''అని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు బిగ్ షాక్ ఐపీఎల్
    జోరుమీదున్న బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌కు బిగ్‌షాక్ ఐపీఎల్
    బెంగళూర్ బ్యాటర్ల ఊచకోత.. లక్నో ముందు భారీ స్కోరు ఐపీఎల్
    డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025