LOADING...
Tim Southee: 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్-కోహ్లీ ఆడాల్సిందే: టిమ్‌ సౌథీ
2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్-కోహ్లీ ఆడాల్సిందే: టిమ్‌ సౌథీ

Tim Southee: 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్-కోహ్లీ ఆడాల్సిందే: టిమ్‌ సౌథీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్‌ స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా ఈ ఇద్దరూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న అభిప్రాయాన్ని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు టిమ్‌ సౌథీ వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ రెండు వన్డేల్లో వరుసగా సున్నాకే వెనుదిరిగినా, మూడో మ్యాచ్‌లో చేసిన అర్థశతకంతో ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. ఆ లయను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన క్లాస్‌ను మరోసారి నిరూపిస్తున్నాడు. రాంచీ, రాయ్‌పూర్‌ వేదికలపై జరిగిన వరుస మ్యాచ్‌ల్లో అతడు శతకాలు బాదుతూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు.

వివరాలు 

వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు

అదేవిధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ సాధించి సత్తా చూపాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో అర్ధశతకం నమోదు చేసి తన నిలకడను చాటాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో పాటు ఫిట్‌నెస్‌లో కూడా టాప్‌లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2027 వరల్డ్‌కప్‌లో వీరిద్దరికి తప్పకుండా చోటు కల్పించాలన్న డిమాండ్‌ మరింత బలంగా వినిపిస్తోంది.

వివరాలు 

వయస్సు అనే అంశం నా దృష్టిలో పెద్ద విషయం కాదు: టిమ్

టిమ్‌ సౌథీ మాట్లాడుతూ.. "వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇప్పటికీ గొప్ప ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు 2027 వరల్డ్‌కప్‌కు అతడిని ఎందుకు తీసుకోకూడదు? అదే విధంగా రోహిత్‌ శర్మ కూడా ఇటీవల ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించి తన సత్తా చూపాడు. వీరిద్దరూ ఆడుతున్నంత కాలం జట్టులో కొనసాగడం ఖాయం. వయస్సు అనే అంశం నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అది కేవలం ఒక సంఖ్య మాత్రమే" అని వ్యాఖ్యానించాడు.

Advertisement

వివరాలు 

రో-కో 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడితేనే భారత్‌కు టైటిల్‌ గెలిచే అవకాశాలు

ప్రస్తుతం సీనియర్‌ ప్లేయర్ల గైర్హాజరీలో భారత జట్టు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌, విరాట్‌ లాంటి అనుభవజ్ఞులు 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడితేనే భారత్‌కు టైటిల్‌ గెలిచే అవకాశాలు మెరుగుపడతాయని అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement