Asian Games: ఆసియా క్రీడల్లో భారత్కు మరో గోల్డ్.. స్క్వాష్లో హరీందర్, దీపిక జోడికి పతకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2023
01:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్కు మరో గోల్డ్ లభించింది. స్క్వాష్ మిక్స్ డే డబుల్స్ మ్యాచులో భారత్ కు చెందిన దీపికా పల్లికల్ కార్తీక్, హరీందర్ పాల్ సంధు జోడి స్వర్ణం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మలేషియా జంట అజ్మన్, సైఫిక్ బిన్ కమన్ పై 11-10, 11-10 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఆసియా గేమ్స్ లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20 కి చేరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి