NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ 
    తదుపరి వార్తా కథనం
    IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ 
    IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్

    IND vs IRE:రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 21, 2023
    09:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 రన్స్ తేడాతో విజయం సాధించింది.

    186 రన్స్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 152/8 రన్స్‌కే పరిమితమైంది.

    ఐర్లాండ్ ఓపెనర్ బల్‌బీర్న్ 72 రన్స్‌తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

    భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్, బిష్ణోయ్ తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.

    మూడో టీ20 ఈనెల 23న జరగనుంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్‌(18),తిలక్‌ వర్మ(1)ను షార్ట్‌పిచ్‌ బంతులతో వరుస ఓవర్లలో ఐర్లాండ్‌ పెవిలియన్‌ కు చేర్చింది.

    Details 

    సత్తా చాటిన శాంసన్ 

    పవర్‌ప్లే లో భారత్ స్కోర్ భారత్‌ 47/2 . విండీస్‌తో సిరీస్‌లో విఫలమైన శాంసన్‌ ఈ మ్యాచ్‌లో సత్తాచాటాడు.

    తొలి 13 బంతుల్లో 14 పరుగులు చేసిన అతను.. కుదురుకున్నాక చెలరేగాడు. తనదైన పవర్‌ హిట్టింగ్‌తో లిటిల్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో పాటు ఓ సిక్సర్‌ బాదేశాడు. మరో బ్యాట్సమెన్ రుతురాజ్‌ అతనికి సహకరించాడు. దీంతో 7 నుంచి 12 మధ్య 6 ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి.

    12 ఓవర్లకు 104/2తో ఉన్న భారత్ భారీ స్కోర్ చేస్తుందనగా ఈ ఇద్దరు కొద్దీ రన్స్ వ్యవధిలో అవుట్ అవడంతో స్కోర్ నెమ్మదించింది.

    ఐర్లాండ్‌ 16, 17, 18వ ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.

    Details 

    ఐర్లాండ్‌ బ్యాటింగ్‌లో బాల్‌బిర్నీ పోరాటం

    ఈ మూడు ఓవర్లలో కలిపి కేవలం 14 పరుగులే వచ్చాయి. అయితే చివరి రెండు ఓవర్లలో వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత్‌ మెరుగైన స్కోరు సాధించింది.

    ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ చేసిన 72 పరుగులకే అత్యధికం. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (0),లోర్కాన్ టకర్ (0) డకౌట్ కాగా, కీలక ఆటగాడు హ్యారీ టెక్టర్ (7) నిరాశపరిచాడు.

    కర్టిస్ కాంఫర్ 18, జార్జ్ డాక్రెల్ 13, మార్క్ అడౌర్ 23 పరుగులు చేయడంతో ఐర్లాండ్ స్కోరు 150 మార్కు చేరుకుంది.

    టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    ఐర్లాండ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీమిండియా

    టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్ రిషబ్ పంత్
    నేడు భారత్‌ వెస్టిండీస్‌ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా వెస్టిండీస్
    IND Vs WI: టీమిండియాకు మరో పరాజయం వెస్టిండీస్
    టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్ వెస్టిండీస్

    ఐర్లాండ్

    భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం క్రికెట్
    BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్ క్రికెట్
    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్ బంగ్లాదేశ్
    ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?  ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025