Asian Games: ఆసియా గేమ్స్కు వైభవ్ ఎంపిక.. సూర్య, గిల్కు నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అందుబాటులో ఉండే ఆటగాళ్లతో ఒక ప్రాథమిక జాబితాను రూపొందించింది. మొత్తం 30 మంది క్రికెటర్ల పేర్లతో కూడిన ఈ జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు సమర్పించింది. ఐపీఎల్లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఇందులో స్థానం కల్పించింది. అయితే, టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
వివరాలు
బీసీసీఐ ప్రణాళిక సిద్ధం..
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో వెస్టిండీస్ జట్టుతో భారత్ స్వదేశంలో ఒక సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. రెండు టోర్నీలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్ కోసం రెండు వేర్వేరు జట్లను సిద్ధం చేయాలని బీసీసీఐ ముందుగానే ప్రణాళిక రూపొందించింది.
వివరాలు
కెప్టెన్ ఎవరు?
ఆసియా గేమ్స్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశమున్న ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే అందుబాటులో ఉంటారని బీసీసీఐ వెల్లడించింది. అయితే తుది జట్టును ప్రకటించే సమయంలో వీరిలో ఇద్దరికే అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.