Page Loader
AUS vs IND: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

AUS vs IND: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు 15 మందితో ప్రకటించింది. ఓపెనర్ నాథన్ మెక్‌స్వినీపై వేటు వేసిన ఆస్ట్రేలియా అతడి స్థానంలో 19 సంవత్సరాల సామ్ కొన్‌స్టాస్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ యువ ఆటగాడు ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ జట్ల మధ్య జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం, ఉస్మాన్ ఖవాజాతో కలిసి సామ్ కొన్‌స్టాస్‌ ఓపెనింగ్‌ దిశగా అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఇక, మరో కీలక విషయంగా, పేసర్ జే రిచర్డ్‌సన్‌ను మూడు సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది. అతనితో పాటు, మరొక పేసర్ అయిన సీన్ అబాట్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

వివరాలు 

భారత్‌తో చివరి రెండు టెస్టులు.. ఆసీస్‌ జట్టు ఇదే 

ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1 సమంగా నిలిచాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. డిసెంబరు 26-30 మధ్య మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు, జనవరి 3-7 మధ్య సిడ్నీలో ఐదో టెస్టు జరగనున్నాయి. పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా,సామ్‌ కొన్‌స్టాస్‌, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.