NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త
    దులీప్ ట్రోఫీ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు

    ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 28, 2023
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.

    స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచులకు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు.

    బీసీసీఐ లోకల్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు.

    దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్లు ఆడుతుండటంతో ఈ టోర్నీపై అభిమానులకు ఆసక్తి పెరిగింది. అయితే ఈ మ్యాచులను ప్రత్యక్షంగా తిలకించే సౌకర్యం లేనందున అభిమానులు నిరాశ చెందారు.

    Details

    వెస్ట్ జోన్ నుంచి బరిలోకి దిగనున్న సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా

    దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ నుంచి సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా లాంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.

    ఇక సెంట్రల్ జోన్ తరుపున రింకూసింగ్, సౌత్ జోన్ నుంచి తిలక్ వర్మ, సాయి సుదర్శన్ లాంటి ఐపీఎల్ స్టార్లు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

    దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరుపున బరిలోకి దిగుతున్నాడు.

    నేటి దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్, నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచులు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ కర్నాటకలోని కెఎస్‌సిఏ క్రికెట్ గ్రౌండ్‌లో, రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దులీప్ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దులీప్ ట్రోఫీ

    దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య సూర్యకుమార్ యాదవ్

    క్రికెట్

    చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన తుషార్ దేశ్‌పాండే చైన్నై సూపర్ కింగ్స్
    జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్ టీమిండియా
    మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ ప్రపంచం
    హాంకాంగ్‌ను ఓడించిన భారత మహిళల జట్టు ఉమెన్ టీ20 సిరీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025