NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పంజాబ్ పై గెలిచినా కేకేఆర్ జట్టు కెప్టెన్ కు షాకిచ్చిన బీసీసీఐ
    తదుపరి వార్తా కథనం
    పంజాబ్ పై గెలిచినా కేకేఆర్ జట్టు కెప్టెన్ కు షాకిచ్చిన బీసీసీఐ
    కేకేఆర్ కెప్టెన్ కు జరిమానా

    పంజాబ్ పై గెలిచినా కేకేఆర్ జట్టు కెప్టెన్ కు షాకిచ్చిన బీసీసీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. అయితే ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది.

    స్లో ఓవర్ రేట్ కారణంగా నితీశ్ కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుంది.

    దీంతో అతనికి రూ.12లక్షలు ఫైన్ వేశారు. ఇప్పటివరకూ 11 మ్యాచ్లు ఆడిన కేకేఆర్, ఐదు మ్యాచ్ లు గెలిచి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

    సోమవారం కేకేఆర్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా సాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ బౌండరీ కొట్టి కేకేఆర్ కు విజయాన్ని అందించాడు.

    Details

    కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం

    ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 47 బంతుల్లో 57 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

    షారుక్ ఖాన్ చివరి 8 బంతుల్లో 21 పరుగులతో విజృంభించాడు. కేకేఆర్ తరుపున వరుణ్ చక్రవర్తి మరోసారి 3 వికెట్లతో సత్తా చాటాడు.

    లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి విజయం సాధించింది.

    కెప్టెన్ నితీష్ రాణా 38 బంతుల్లో 51 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఈ విజయంలో కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా నైట్ రైడర్స్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025