NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 
    శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!

    MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2025
    11:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు అదరగొడుతోంది.

    క్వాలిఫయర్ -2లో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్‌లో అడుగుపెట్టింది.

    ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

    తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44) అద్భుతంగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా రెండు వికెట్లు తీయగా, జేమీసన్, విజయ్ కుమార్ వైశాక్, చాహల్ తలతా ఒకొక్క వికెట్ సాధించారు.

    Details

    రాణించిన అయ్యర్

    తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్ - 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), నేహల్ వధేరా (48 - 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

    ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

    ఈ విజయంతో పంజాబ్ జట్టు ఫైనల్‌లోకి చేరినా, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలపై బీసీసీఐ జరిమానాలు విధించింది. ఇరు జట్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

    Details

    శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షలు

    ఈ సీజన్‌లో ఇది రెండోసారి పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ చేసిన కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించారు.

    అలాగే ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌కి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (దానిలో తక్కువదానిని) జరిమానాగా విధించనున్నారు.

    మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఈ సీజన్‌లో మూడోసారి ఉల్లంఘించడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించారు.

    మిగిలిన ఆటగాళ్లకు, ఇంపాక్ట్ ప్లేయర్‌కు రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (దానిలో తక్కువదానిని) జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రేయస్ అయ్యర్
    ముంబయి ఇండియన్స్

    తాజా

    India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌  అమెరికా
    MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!  శ్రేయస్ అయ్యర్
    Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి
    Telugu Movies This week: థగ్ లైఫ్‌ నుంచి గ్యాంబ్లర్స్‌ వరకు.. జూన్‌ ఫస్ట్ వీక్‌లో థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే టాలీవుడ్

    శ్రేయస్ అయ్యర్

    ఆసీస్‌తో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం క్రికెట్
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? క్రికెట్
    టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..! క్రికెట్
    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ క్రికెట్

    ముంబయి ఇండియన్స్

    IPL 2025: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీలో మార్పు.. సూర్యకుమార్‌కు జట్టు పగ్గాలు! రోహిత్ శర్మ
    CSK Vs MI Weather Report: ఇవాళ చెన్నై వేదికగా సిఎస్‌కే, ఎంఐ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌ చైన్నై సూపర్ కింగ్స్
    MI vs CSK: ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన చెన్నై! చైన్నై సూపర్ కింగ్స్
    MI vs GT: ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025