LOADING...
Asia Cup 2025: దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..
దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..

Asia Cup 2025: దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆసియా కప్.. తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఓకే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఆసియా కప్‌కి సంబంధించి ఒక కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ అభిమానులకు ఇది మరొకసారి ఉత్సాహాన్ని కలిగించే విషయం. భారత్,పాకిస్థాన్ జట్లు మరోసారి ఒకే గ్రూపులో పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజా సమాచారం చెబుతోంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఈ టోర్నమెంట్ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడినప్పటికీ, ఇప్పుడు ఆ సమస్యలు తీరినట్లు తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ T20 టోర్నీ జరగడానికి ఇక ఎటువంటి అడ్డంకులు లేవని సమాచారం. గురువారం ఢాకాలో నిర్వహించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆసియా కప్‌ నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)అధికారులు వర్చువల్ రూపంలో హాజరయ్యారు.

వివరాలు 

దుబాయ్,అబుదాబీ వేదికలపై మ్యాచ్‌లు

BCCI ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించేందుకు అంగీకారాన్ని ప్రకటించింది. దుబాయ్,అబుదాబీ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. క్రికెట్ బోర్డు (ECB)తో ముగింపు దశలో ఉన్న ఒప్పందం ప్రకారం మూడు వేదికలు ఉపయోగించనున్నట్లు మొదట తెలిపినప్పటికీ, ఆసియా కప్ కోసం కేవలం రెండు వేదికలనే ఎంచుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్‌ను భారత్‌ నిర్వహించాల్సిన బాధ్యతతో ఉన్నప్పటికీ, పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఇందులో పాల్గొనకపోవచ్చని, టోర్నీ ఆతిథ్యం నుంచి తప్పుకోవచ్చని వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే, పాకిస్తాన్ జట్టు భారత భూభాగంలో ఆడేందుకు నిరాకరించవచ్చని ఊహాగానాలు వినిపించాయి.

వివరాలు 

సెప్టెంబర్ 7 నుంచి టోర్నీ ప్రారంభం 

ఈ నేపథ్యంలో, BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీలు త్వరలో సమావేశమై వేదికలు, టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. టోర్నీ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమై మూడవ లేదా నాలుగవ వారంలో ముగియనుంది. ఈ టోర్నమెంట్‌ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న T20 ప్రపంచకప్‌కు ప్రాక్టీస్ వేదికగా భావిస్తున్నారు.