NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 
    ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన

    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2024
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ టోర్నీ కోసం భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడంపై సందేహం నెలకొంది.

    ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు.

    వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వ అనుమతిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని శుక్లా తెలిపారు.

    Details 

    రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు..

    భారత్ ,పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. రెండు జట్లు ICC టోర్నమెంట్‌లు లేదా ఆసియా కప్ వంటి బహుళజాతి టోర్నమెంట్‌లలో మాత్రమే ఆడుతున్నాయి.

    భారత్-పాకిస్థాన్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-2013లో జరిగింది.గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా అందులో భారత జట్టు విజయం సాధించింది.

    వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇరు జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరగనుంది.

    ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే ముందు దౌత్య, భద్రతా అంశాలతో సహా అనేక అంశాలు చర్చించబడ్డాయి.

    Details 

    'భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తాం' 

    భద్రతా సమస్యలు, చరిత్ర దృష్ట్యా, టోర్నమెంట్ కోసం భారతదేశం పొరుగు దేశానికి వెళ్లడంపై ఏదైనా నిర్ణయం, అధికారులతో చర్చించిన తర్వాత మాత్రమే తీసుకోబడుతుంది.

    ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినంత వరకు, భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చెప్పినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది.

    "ప్రభుత్వం అనుమతిస్తేనే మా బృందాన్ని పంపిస్తాం. భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం"అని శుక్లా అన్నారు.

    Details 

    ఆసియా కప్‌కు పాకిస్థాన్ వెళ్లని టీమిండియా 

    గత సంవత్సరం, ODI ప్రపంచ కప్‌కు ముందు, ఆసియా కప్‌ను పాకిస్థాన్ లో నిర్వహించాల్సి ఉండగా దాయాది దేశానికి వెళ్లడానికి భారత జట్టు నిరాకరించింది.

    ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్‌లో టోర్నమెంట్ నిర్వహించారు. టీమిండియా మ్యాచ్‌లు అన్ని శ్రీలంకలో జరగగా , ఇతర జట్ల మ్యాచ్‌లు పాకిస్థాన్ లో జరిగాయి.

    అయితే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్‌లో పర్యటించింది. ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్‌కు రాకపోతే భారత్‌లో పర్యటించబోమని గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరించినప్పటికీ ప్రపంచ స్థాయిలో బోర్డు మద్దతు పొందలేకపోయింది.

    2017లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బీసీసీఐ

    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే! టీమిండియా
    టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్! టీమిండియా
    భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన  భారత జట్టు
    ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి  క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025