
RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఒక జట్టు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి, ఆఖరికి కలను నెరవేర్చుకుంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ ప్రతిసారి అభిమానులు ఆశతో ఎదురుచూస్తూ, ట్రోల్స్ను తట్టుకుని నిలబడ్డ ఆ జట్టు... ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి టైటిల్ను ముద్దాడింది.
అదే బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ). 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఐపీఎల్-18 సీజన్లో ఆర్సీబీ గెలుపొందింది.
మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనతను సాధించింది.
అప్పటివరకు అసంపూర్ణంగా ఉన్న ఆ టైటిల్ గాధకు ముగింపు పలికింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయిన ఆర్సీబీ.. ఈసారి తమ లక్ష్యాన్ని చేరుకుంది.
Details
విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్
తమ మొదటి టైటిల్ విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది.
దీంతో బుధవారం (జూన్ 5) మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరులోని విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విక్టరీ పరేడ్ చేపట్టనుంది. దీనిని ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ విజయంతో ఆర్సీబీ అభిమానులు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ హర్షాతిరేకంలో మునిగిపోయారు.
ఇప్పటివరకు గెలవలేదన్న బాధను వెనక్కు నెట్టేస్తూ.. ప్రతి ఊరునా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. బాణాసంచా, డ్యాన్సులతో పండగలా కనిపిస్తోంది.
బెంగళూరులోని రోడ్లపై ఆర్సీబీ గెలుపు వేడుకలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియాలో ఆర్సీబీ విజయంపై ఫన్నీ మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Details
ఫైనల్ మ్యాచ్పై ఒకసారి పరిశీలిస్తే
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
పంజాబ్ బౌలర్లలో కైల్ జేమిసన్, అర్ష్దీప్ సింగ్ తలో మూడేసి వికెట్లు తీసి రాణించారు.
అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.
శశాంక్ సింగ్ 61 పరుగులు చేసి పోరాడినా, విజయాన్ని అందుకోలేకపోయారు.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు.