NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత 
    తదుపరి వార్తా కథనం
    Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత 
    కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత

    Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

    కేవలం 4 నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లను తీసిన బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

    టీ20 కెప్టెన్‌గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు.

    ఇప్పటివరకూ ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాకపోవడం గమనార్హం.

    Details

    భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ గా ఎంపికైన తొలి కెప్టెన్ బుమ్రానే

    ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రా ద్వితీయ శ్రేణికి జట్టుకు నాయకత్వం వహించాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఫాస్ట్ బౌలర్ కూడా బుమ్రానే కావడం విశేషం.

    ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు భారత్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

    వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడటంతో అంపైర్లు భారత్ ను విజేతగా నిర్ణయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జస్పిత్ బుమ్రా
    టీమిండియా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    జస్పిత్ బుమ్రా

    Bumrah is Back: యార్కర్ల కింగ్ బుమ్రా వచ్చేశాడు భారత జట్టు
    టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం క్రికెట్
    మైదానంలోకి అడుగుపెట్టిన యార్కర్ల కింగ్ బుమ్రా టీమిండియా
    జస్ప్రీత్ బుమ్రాను తప్పించిన బీసీసీఐ..! క్రికెట్

    టీమిండియా

    WI vs IND: ఇండియా, విండీస్ జట్ల మధ్య రేపే టీ20 మ్యాచ్.. గెలుపు ఎవరిదో? వెస్టిండీస్
    WI vs IND 1st T20I: బ్రియాన్ లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం.. నేడే తొలి టీ20 మ్యాచ్ వెస్టిండీస్
    Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ క్రికెట్
    IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి వెస్టిండీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025