
England: టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర సెంచరీ సాధించడంతో, పొట్టి ఫార్మాట్లో 300 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఫుల్ మెంబర్ జట్టు గా ఇంగ్లండ్ అరుదైన ఘనత సాధించింది. ఈ చారిత్రక రికార్డు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో నమోదైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 304 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Details
60 బంతుల్లో 141 పరుగులు
సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన ఫిల్ సాల్ట్ కేవలం 60 బంతుల్లోనే చెలరేగి, ఫోర్లు-సిక్సర్ల వర్షం కురిపిస్తూ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా కెప్టెన్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 83 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. తర్వాత వచ్చిన జాకబ్ బెతెల్ (26), హ్యారీ బ్రూక్ (41 నాటౌట్) కూడా తమ వంతు రాణించడంతో, ఇంగ్లండ్ స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇంతకు ముందు అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ (మంగోలియాపై 314/3), జింబాబ్వే (గాంబియాపై 344/4) మాత్రమే 300 పైగా పరుగులు చేశారు. ఫుల్ మెంబర్ దేశాల మధ్య మ్యాచ్లో 300 పరుగుల మార్క్ దాటిన తొలి ఘనత ఇంగ్లండ్కే దక్కింది.
Details
తేలిపోయిన ఇంగ్లండ్ బౌలర్లు
ఫిల్ సాల్ట్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ భారత అభిమానులకు సుపరిచితమే. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున కూడా సాల్ట్ ఇలాగే అద్భుతమైన దూకుడుతో ఆకట్టుకున్నాడు. ఆ ఫామ్ను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తూ, జట్టుకు చారిత్రక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.