
Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నైజీరియాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో 21 మంది క్రీడాకారులు దుర్మరణం పాలయ్యారు.
ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్ఆర్ఎస్సి) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి ఇతర వాహనాల ప్రమేయం లేకుండా కేవలం బస్సు ఒక్కటే ప్రమాదానికి గురైంది.
డ్రైవర్కు అలసట రావడం లేదా అతివేగంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు.
Details
నైజీరియాలో సురక్షిత రవాణా వ్యవస్థపై ఆందోళనలు
ఘటన సమయంలో క్రీడాకారులు ఒగున్ రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాల నుంచి, ఉత్తర నైజీరియాలోని కానో నగరానికి తిరిగి వెళ్తున్నారు.
దాదాపు 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన అనంతరంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఈ క్రీడల్లో వీల్చైర్ బాస్కెట్బాల్తో పాటు పశ్చిమ ఆఫ్రికా సంప్రదాయ కుస్తీ వంటి పలు క్రీడా విభాగాలు ఉన్నాయి.
అధ్యక్షుడు బోలా టినుబు ఈ పోటీలను దేశ ఐక్యత, బలం, స్థిరత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. నైజీరియాలో సురక్షిత రవాణా వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Details
క్రీడాకారులకు అన్ని విధాలా అందుకుంటాం
రహదారుల దుర్వినియోగం, వాహనాల అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాల వల్ల ఈ తరహా ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
ఎఫ్ఆర్ఎస్సి గణాంకాల ప్రకారం, 2023లో మొత్తం 9,570 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 5,421 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.
మరణించిన క్రీడాకారుల కుటుంబాలకు అన్ని విధాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.