NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
    నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 01, 2025
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నైజీరియాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

    జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో 21 మంది క్రీడాకారులు దుర్మరణం పాలయ్యారు.

    ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్‌ (ఎఫ్ఆర్‌ఎస్‌సి) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి ఇతర వాహనాల ప్రమేయం లేకుండా కేవలం బస్సు ఒక్కటే ప్రమాదానికి గురైంది.

    డ్రైవర్‌కు అలసట రావడం లేదా అతివేగంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు.

    Details

    నైజీరియాలో సురక్షిత రవాణా వ్యవస్థపై ఆందోళనలు

    ఘటన సమయంలో క్రీడాకారులు ఒగున్ రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాల నుంచి, ఉత్తర నైజీరియాలోని కానో నగరానికి తిరిగి వెళ్తున్నారు.

    దాదాపు 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన అనంతరంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    ఈ క్రీడల్లో వీల్‌చైర్ బాస్కెట్‌బాల్‌తో పాటు పశ్చిమ ఆఫ్రికా సంప్రదాయ కుస్తీ వంటి పలు క్రీడా విభాగాలు ఉన్నాయి.

    అధ్యక్షుడు బోలా టినుబు ఈ పోటీలను దేశ ఐక్యత, బలం, స్థిరత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. నైజీరియాలో సురక్షిత రవాణా వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

    Details

    క్రీడాకారులకు అన్ని విధాలా అందుకుంటాం

    రహదారుల దుర్వినియోగం, వాహనాల అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాల వల్ల ఈ తరహా ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.

    ఎఫ్ఆర్‌ఎస్‌సి గణాంకాల ప్రకారం, 2023లో మొత్తం 9,570 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 5,421 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతిని రేపింది.

    మరణించిన క్రీడాకారుల కుటుంబాలకు అన్ని విధాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నైజీరియా
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    నైజీరియా

    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి  తాజా వార్తలు
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  ఆర్మీ
    Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య  అంతర్జాతీయం
    Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే  అంతర్జాతీయం

    రోడ్డు ప్రమాదం

    Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు జమ్ముకశ్మీర్
    Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి  కృష్ణా జిల్లా
    Karnataka: పుణె-బెంగళూరు హైవేపై బస్సు ట్రక్కు ఢీకొని 13 మంది మృతి కర్ణాటక
    Pune accident: పూణెలో కారు బోల్తా పడి ఐదుగురు తెలంగాణ యువకులు మృతి  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025