Page Loader
First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 
క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ క్రీడను అభిమానించే ప్రతి ఒక్కరూ, క్రికెట్ మ్యాచ్ ప్రసారం అవుతున్నప్పుడు తమ ఇతర పనులను పక్కన పెట్టి, టీవీ ముందు కూర్చొని మ్యాచ్ చూస్తుంటారు. అయితే మనం ఎంతో ఇష్టపడే ఈ క్రికెట్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది, ఇందులో భాగంగా భారత్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడింది వంటి అంశాలపై ఈ కథనంలో తెలుసుకుందాం.

వివరాలు 

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌

క్రికెట్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే.. 1844లో న్యూయార్క్‌లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ వేదికగా, అమెరికా, కెనడా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెనడా జట్టు 23 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. ఇక మరికొంత మంది 1877లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌గా భావిస్తారు. అయితే అది నిజం కాదు. అసలైన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1844లో అమెరికా-కెనడా జట్ల మధ్య వన్డే మ్యాచ్ అయ్యింది. ఇది మాత్రమే కాక, ఏకంగా రెండు దేశాల మధ్య జరిగిన మొదటి అంతర్జాతీయ క్రీడా పోటీ కూడా ఇదే కావడం విశేషం.

వివరాలు 

మొదటి ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్

మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ 1877 మార్చి 15 నుంచి 19 మధ్య, ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సారి 1975లో జూన్ నెలలో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ కప్‌లో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశాల ప్రతినిధులతో "ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్"గా ప్రారంభమైంది. తరువాత, 1965లో దీన్ని "ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్"గా మార్చారు. 1987లో ఈ సంస్థను "అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)"గా పునర్నామకరణం చేశారు. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది.

వివరాలు 

టీమ్ ఇండియా కెప్టెన్‌గా సీకే నాయుడు

భారత జట్టు ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1932 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగింది. అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా సీకే నాయుడు వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారతదేశంలో జరిగిన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1933లో ముంబయిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ - భారత్ జట్లు తలపడ్డాయి.