NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ 
    తదుపరి వార్తా కథనం
    M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ 
    M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ

    M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2024
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది.ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

    ధోని గతంలో తనను ₹15 కోట్ల మేర మోసం చేశారంటూ వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాడు.

    తమపై తప్పుడు ఆరోపణలు చేసి, తమ పరువుకు భంగం కలిగించినందుకు ధోనీ నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

    తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు,మీడియా సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని కోరారు.

    ధోనీపై దాఖలైన పరువు నష్టం దావా జనవరి 18న జస్టిస్ ప్రతిభా ఎం సింగ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

    Details 

    క్రికెట్ అకాడమీలు ఏర్పాటుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం

    స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'ఆర్కా స్పోర్ట్స్' డైరెక్టర్లుగా ఉన్న దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై ధోనీ రాంచీలోని దిగువ కోర్టులో కేసు వేశారు.

    2017లో ఈ ఇద్దరు నిందితులు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేటట్టు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకున్నారు.

    ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాంఛైజీ ఫీజు,లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాలి.అయితే వారు ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంఛైజీ ఫీజు,లాభాలు పంచడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగాడు.

    ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు.

    Details 

    అక్టోబర్ 27న క్రిమినల్ కేసు నమోదు

    కంపెనీ డైరెక్టర్స్ మిహిర్‌ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్‌పై క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

    ధోని నిందితులకు లీగల్ నోటీసులు కూడా అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

    ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 406, 420 కింద గతేడాది అక్టోబర్ 27న క్రిమినల్ కేసు నమోదు చేశారు.

    ఈ విషయాన్ని ధోని తరువు న్యాయవాది ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు.

    ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తాజాగా దివాకర్‌ కొట్టిపడేయడమే కాకుండా ధోనీ తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ పరువు నష్టం దావా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎంఎస్ ధోని

    సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..? క్రికెట్
    ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్  ఐపీఎల్
    IPL 2023: ఆ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు: హర్భజన్ సింగ్! హర్బజన్ సింగ్
    ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025