Page Loader
AUS vs IND: గావస్కర్ నుంచి కోహ్లీ వరకు.. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చరిత్ర సృష్టించిన వివాదాలు
గావస్కర్ నుంచి కోహ్లీ వరకు.. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చరిత్ర సృష్టించిన వివాదాలు

AUS vs IND: గావస్కర్ నుంచి కోహ్లీ వరకు.. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చరిత్ర సృష్టించిన వివాదాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2024
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లు ఎప్పుడూ హైటెన్షన్ వాతావరణం లాగే జరుగుతాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పేరిట జరిగే ఈ సిరీస్‌లో ఎన్నో ఆసక్తికర ఘటనలతో పాటు పలు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఘటనల గురించి తెలుసుకుందాం. 1. మన్కడింగ్ వివాదం 1947-48 సీజన్‌లో భారత్ తొలి సారి ఆస్ట్రేలియా పర్యటన చేసింది. సిడ్నీ టెస్టులో వినూ మన్కడ్ నాన్-స్ట్రైకర్ బిల్లి బ్రౌన్‌ను క్రీజ్ వెలుపల నిలిచినందుకు ఔట్ చేశాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్ మన్కడ్ ఈ చర్యను సమర్థించడం విశేషం. ఇప్పుడు ఇది చట్టబద్ధమైన రనౌట్‌గా మారింది.

Details

 2. గావస్కర్ vs లిల్లీ 

1980-81 సీజన్‌లో మెల్‌బోర్న్ టెస్టులో అంపైర్ తప్పుడు ఎల్బీ నిర్ణయంతో సునీల్ గావస్కర్ చిర్రుబుర్రులాడిపోయాడు. డెన్నిస్ లిల్లీ అసభ్యంగా మాట్లాడడంతో మైదానం విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అప్పటి మేనేజర్ జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. 3. భజ్జీ - సైమండ్స్ 'మంకీగేట్' 2008 సిడ్నీ టెస్టులో హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్‌లోనే అత్యంత వివాదాస్పదం. సైమండ్స్ హర్భజన్ తనను 'మంకీ' అని పిలిచాడని ఆరోపించాడు. ఐసీసీ నిషేధం విధించినా, భారత్ స్వదేశానికి వెళ్లిపోతామంటూ గట్టిగా నిలబడింది. సచిన్ టెండుల్కర్ జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం చల్లబడింది.

Details

 4. స్మిత్ 'డీఆర్‌ఎస్ చీటింగ్' వివాదం 

2017 బెంగళూరు టెస్టులో స్టీవ్ స్మిత్ డీఆర్‌ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ నుండి సలహా తీసుకోవడానికి ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ ఈ విషయం అంపైర్ల దృష్టికి తీసుకెళ్లడంతో స్మిత్‌ను వెంటనే బయటకు పంపారు. కోహ్లీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 5. సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు 2020-21 సీజన్‌లో సిడ్నీ టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఫీల్డ్ అంపైర్లు చర్య తీసుకుని, ఆరుగురిని స్టేడియం నుంచి బయటకు పంపారు. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది.

Details

 6. పంత్ - పైన్ స్లెడ్జింగ్ 

2018-19 సీజన్‌లో రిషబ్ పంత్, టిమ్ పైన్ మధ్య స్లెడ్జింగ్ హైలైట్‌గా నిలిచింది. పైన్ తన మాటలతో పంత్‌ను ప్రవర్తింపజేయగా, పంత్ ఆడుతూ తిరిగి పైన్‌ను ఉడికించాడు. ఈ మాటల యుద్ధం అభిమానుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. నేటి తరం ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమవుతున్న టీమ్ ఇండియా, తమ అడ్డుకట్ట కోసం రెడీ అయిన ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లు ఎలా ఉంటాయో చూడాలి.