
ICC: బ్లాక్ సాక్స్తో గిల్కి జరిమానా ముప్పు.. ఐసీసీ రూల్ ఏం చెబుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్మాన్ గిల్ (127 నాటౌట్) శతకాలతో రాణించారు. గిల్తో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Details
శుభ్మాన్ గిల్కి జరిమానా ముప్పు!
ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్మాన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలను ఉల్లంఘించాడు. డ్రెస్కోడ్ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్లు తప్పనిసరిగా తెలుసు, క్రీమ్ లేదా లేత బూడిద రంగుల సాక్స్ ధరించాలి (ఐసీసీ 19.45 నిబంధన). కానీ గిల్ కేఎల్ రాహుల్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చినప్పుడు నల్ల రంగు సాక్స్ వేసుకోవడం గమనార్హం.
Details
ఐసీసీ నుంచి శిక్షా అవకాశం
గిల్ నల్ల సాక్స్ ధరించడం ద్వారా నిబంధన ఉల్లంఘన జరిగినట్టు భావిస్తే, అతనికి ఐసీసీ శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది లెవల్-1 నేరం కావడంతో మ్యాచ్ ఫీజులో 10 నుంచి 20 శాతం జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, రిఫరీ గిల్ ఉద్దేశపూర్వకంగా నల్ల సాక్స్ ధరించలేదని భావిస్తే, జరిమానా నుండి తప్పించుకోవచ్చు. తుది నిర్ణయం రిఫరీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Details
గతంలోనూ జరిమానా విధింపు
క్రిస్ గేల్ 2016లో బ్లాక్ లేబుల్తో ఉన్న బ్యాట్ ఉపయోగించడం వల్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా చెల్లించాడు. 2018లో అఫ్గానిస్తాన్తో టెస్టులో కేఎల్ రాహుల్ భద్రతా ప్రమాణాలను పాటించని హెల్మెట్ ధరించడం వల్ల 10 శాతం ఫైన్ ఎదుర్కొన్నాడు. 2021లో జో రూట్ రైన్బో చిహ్నం ఉన్న జెర్సీ ధరించడం వల్ల 15 శాతం జరిమానా పడింది. 2019 ప్రపంచకప్లో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ అనధికార లోగో ఉన్న బ్యాట్ ఉపయోగించడం వల్ల జరిమానా విధించాల్సి వచ్చింది.