LOADING...
WPL: ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై గుజరాత్‌ జెయింట్స్‌ ఘన విజయం
ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై గుజరాత్‌ జెయింట్స్‌ ఘన విజయం

WPL: ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై గుజరాత్‌ జెయింట్స్‌ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
11:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఉత్కంఠభరిత విజయం నమోదు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. దిల్లీ ఇన్నింగ్స్‌లో లిజెల్లె లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 86 పరుగులు సాధించగా, లారా వాల్వార్డ్‌ 77 పరుగులతో కీలక సహకారం అందించింది.

Details

రాణించిన గుజరాత్ బౌలర్లు

జెమీమా రోడ్రిగ్స్‌ 15 పరుగులు చేసింది. అయితే చివరి దశలో అవసరమైన పరుగులు సాధించలేకపోవడంతో దిల్లీ విజయానికి దూరమైంది. గుజరాత్‌ బౌలర్లలో రాజేశ్వరి, సోఫీ డివైన్‌ చెరో రెండు వికెట్లు తీసి దిల్లీపై ఒత్తిడి తెచ్చారు. ఇక కశ్వీ గౌతమ్‌ ఒక వికెట్‌ పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది.

Advertisement