
Asia Cup 2025: ప్రపంచంలో మూడో క్రికెటర్గా.. అరుదైన రికార్డుకు చేరువలో హార్ధిక్ పాండ్యా
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ ఆల్రౌండర్ హర్థిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ టోర్నమెంట్లో అతను అరుదైన రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఈ ఘనతను కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. హార్దిక్ పాండ్యా ఆ రికార్డును అందుకున్న క్షణం నుంచి అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.
Details
ఆసియా కప్ 2025 వివరాలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భారత్ సెప్టెంబర్ 14న తన సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది. వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచకప్ (2026) భారత్-శ్రీలంక మధ్య జరుగుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్ కూడా టి20 ఫార్మాట్లోనే నిర్వహించబడుతోంది.
Details
హార్దిక్ పాండ్యా కెరీర్ మైలురాయి దగ్గరలోనే
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టి20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో మరో 6 వికెట్లు పడగొట్టగానే అతను టి20 ఐల్లో 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు అతను 114 టి20 ఐ మ్యాచ్లలో 27.88 సగటుతో 1812 పరుగులు సాధించాడు. వీటిలో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో ఇప్పటి వరకు 94 వికెట్లు తీసి భారత్కు కీలక విజయాలు అందించాడు.
Details
భారత్ తరపున అరుదైన రికార్డు
హార్దిక్ పాండ్యా ఇప్పటికే 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పుడు కేవలం 6 వికెట్లు తీస్తే అతను 'అద్వితీయ సెంచరీని పూర్తి చేసి, భారత్ తరపున టి20 అంతర్జాతీయ క్రికెట్లో 1000+ పరుగులు, 100+ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం ఇద్దరే టి20 అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన ఘనతను ఇప్పటివరకు కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. వారు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ. హార్దిక్ ఈ జాబితాలో చేరితే ప్రపంచంలో మూడో ఆటగాడిగా నిలుస్తాడు.