NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ
    తదుపరి వార్తా కథనం
    WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ
    డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న ఇండియా, ఆస్ట్రేలియా

    WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 26, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.

    ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు రూ.13.24 కోట్లను ప్రైజ్‌మనీ అందుకుంటుంది. రన్నరప్ జట్టుకు రూ.6.5 కోట్లు దక్కనుండగా.. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3.6కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.2.8 కోట్లను ఐసీసీ అందజేయనుంది.

    ఐదో ప్లేస్ లో నిలిచిన జట్టుకు రూ.1.6 కోట్లు దక్కనుండగా.. 7, 6, 8, 9వ స్థానాల్లో నిలిచిన జట్టుకు రూ.82 లక్షలు పారితోషకం అందనుంది.

    Details

    జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

    జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. గెలుపొందిన జట్టుకు గదతో పాటు భారీ ప్రైజ్ మనీ కూడా దక్కుతుందని ఐసీసీ నేడు స్పష్టం చేసింది.

    అయితే 2021లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్, ఇండియాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ జట్టుకు గదతో పాటు 16లక్షల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ నిలిచిన ఇండియా జట్టుకు 8 లక్షల డాలర్లు దక్కాయి.

    ఇప్పటికే డబ్య్లూటీసీ ఫైనల్ కోసం టీమిండియా సాధన మొదలు పెట్టింది. ఈ ఫైనల్ కోసం ఇప్పటికే తొలి బ్యాచ్ ఇంగ్లండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    టీమిండియా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్

    టీమిండియా

    మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ క్రికెట్
    WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా క్రికెట్
    'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్ క్రికెట్
    టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025