NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC: హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!
    తదుపరి వార్తా కథనం
    ICC: హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!
    హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!

    ICC: హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ తన చర్యలను వేగవంతం చేసింది.

    షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే, భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు నిరాకరించడంతో, హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) ప్రతిపాదించింది.

    అయితే, ఈ ప్రతిపాదనపై పీసీబీ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదు.

    తాజా సమాచారం ప్రకారం, ఐసీసీ హైబ్రిడ్ మోడల్ అమలుకు సిద్ధమైందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

    పాక్ అంగీకరించకపోతే ఆర్థికంగా పెద్ద నష్టాలు ఎదురవుతాయని, టోర్నీ వేదికను మార్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.

    పాక్ అంగీకరించిన పక్షంలో, నవంబర్ 29 నాటికి షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఐసీసీ సన్నద్ధమవుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించడానికి సిద్ధంగా ఐసీసీ 

    The ICC likely to propose a hybrid model for the 2025 Champions Trophy. (Cricbuzz). pic.twitter.com/e7sSCjOS86

    — Mufaddal Vohra (@mufaddal_vohra) November 27, 2024

    వివరాలు 

    టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించడం మా ప్రాధాన్యత: ఐసీసీ 

    హైబ్రిడ్ మోడల్ ప్రకారం,టోర్నమెంట్‌లోని 10 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి.మిగిలిన ఐదు మ్యాచ్‌లు (అందులో ఒక సెమీఫైనల్, ఫైనల్‌ సహా) ఇతర దేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

    భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబీ లేదా దక్షిణాఫ్రికాలో జరిగే అవకాశం ఉందని సమాచారం.

    పాక్‌కు, ఐసీసీ ప్రతిపాదనను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు.

    ''టోర్నీ నిర్వహణ కోసం హైబ్రిడ్ మోడల్‌ను పాక్‌కు ప్రతిపాదించాం. భారత మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు, టీమ్ ఇండియా ఫైనల్ చేరితే దుబాయ్ లేదా అబుదాబీలో ఆ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధమని సూచించాం. పాక్ అంగీకరించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడం. మా ప్రాధాన్యత టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించడంలోనే ఉంది'' అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఐసీసీ

    ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    ODI WC 2023: పాక్ కోచ్ మికీ ఆర్థర్ కామెంట్లపై ఐసీసీ అదిరిపోయే కౌంటర్ పాకిస్థాన్
    ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్! ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025