NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 
    తదుపరి వార్తా కథనం
    PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 
    భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా

    PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    10:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌ను వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది.

    భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

    మే 7 బుధవారం నుంచి ఇప్పటివరకు పీఎస్ఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మే 8 గురువారం రావల్పిండిలో జరగాల్సిన కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మీ మ్యాచ్‌ కూడా రద్దయ్యింది.

    ఈ మ్యాచ్‌కు ముందు భారత దళాలు రావల్పిండీ స్టేడియం సమీపంలో దాడులు చేయడంతో అధికారులు ఆ మ్యాచ్‌ను నిలిపివేశారు.

    భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన పీఎస్ఎల్ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మారుస్తామని పీసీబీ తొలుత ప్రకటించింది.

    Details

    టోర్నమెంట్‌ను తాత్కాలికంగా వాయిదా

    రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన చివరి ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.

    అయితే చివరికి మొత్తం టోర్నమెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.

    ఇక మరోవైపు, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్ కూడా దేశంలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో ఒక వారం పాటు వాయిదా పడింది.

    దేశంలో తీవ్రమైన పరిస్థితుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సముచితం కాదని బీసీసీఐ తెలిపింది.

    ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన బోర్డు, టోర్నీని తాత్కాలికంగా నిలిపివేసింది.

    ప్రస్తుతం ఐపీఎల్‌లో 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ మరియు ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    PSL 2025 Postponed: భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం.. పీఎస్ఎల్ 2025 సీజన్ వాయిదా  పాకిస్థాన్
    India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్‌.. సరిహద్దుల్లో హై అలర్ట్‌! పాకిస్థాన్
    India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి ఆపరేషన్‌ సిందూర్‌
    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్

    పాకిస్థాన్

    Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు భారతదేశం
    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం? భారతదేశం
    Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపివేసిన భారత్ భారతదేశం
    X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌ భారతదేశం

    క్రికెట్

    BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ బీసీసీఐ
    IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? బీసీసీఐ
    Team India: బీసీసీఐ షాకింగ్‌ డెసిషన్‌.. కోచింగ్‌ స్టాఫ్‌లో మార్పులు?  బీసీసీఐ
    IPL 2025: ఒక ప్లేయర్, తొమ్మిది జట్లు.. ఐపీఎల్‌లో అన్నీ ఫ్రాంచైజీలను కవర్ చేసిన ప్లేయర్ ఎవరంటే?  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025