Page Loader
IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ
సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కాలంటే టీమిండియా చివరి టెస్టు నెగ్గాల్సిందే. మార్చి 9 ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగుసార్లు గెలిచాయి. మిగిలిన ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2021లో ఈ వేదికపై భారత్ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులను ఆడింది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇండియా విజయం సాధించింది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ఉదయం 9:30 గంటలకు ప్రసారం కానుంది.

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు

ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటి వరకు 105 టెస్టులను ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా 44 విజయాలు సాధించగా.. భారత్ 32 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. 28 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 53 టెస్టుల్లో భారత్ 23 విజయాలను సాధించింది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. భారత్: రోహిత్‌శర్మ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్-కీపర్), జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, షమీ. ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, లాబుషాగ్నే, స్మిత్ (కెప్టెన్), హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ (వికెట్-కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్‌లియోన్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ స్టార్క్, టాడ్‌మర్ఫీ.